Senthil kumar.. సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న కేకే సెంథిల్ కుమార్ (KK Senthil kumar) ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా ఈయన తల్లి స్వర్గస్తులయ్యారు. ఇకపోతే భార్య మరణించి ఆరు నెలలు కూడా గడవకముందే తల్లి కూడా మరణించడం ఆయనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. భార్య మరణం నుంచి కోలుకోలేకపోతున్న సెంథిల్ కుమార్ కి తల్లి మరణం అతిపెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. తాజాగా సెంథిల్ కుమార్ తల్లి మరణం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ విషయం తెలిసే పలువురు సెలబ్రిటీలు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెడుతున్నారు. అంతేకాదు గుండె ధైర్యంతో ముందుకు సాగాలని సెంథిల్ కుమార్ కు ఓదార్పును ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే సెంథిల్ కుమార్ తల్లి మరణానికి గల కారణాలు తెలియాల్సి వుంది. మొత్తానికి అయితే తల్లి మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పవచ్చు.
సెంథిల్ కుమార్ తల్లి మరణం..
సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సెంథిల్ కుమార్ తల్లి తాజాగా హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలోని తన ఇంటిలో మరణించారు.ఆమె వయసు మీద పడడంతో వృద్ధాప్య రీత్యా మరణించినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం సెంథిల్ కుమార్ నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమా కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతూ ఉండగా.. ఆయనకు కాల్ రావడంతో హుటాహుటిన అక్కడ్నుంచి తన ఇంటికి బయలుదేరారు.
భార్య కూడా మరణం..
ఇకపోతే ఈయన భార్య యోగ ట్రైనర్ రూహీ కూడా ఫిబ్రవరి నెలలో మరణించారు. ఎంతోమంది తారలకు యోగా టీచర్గా పని చేసిన ఈమె అనారోగ్యంతో ఫిబ్రవరి 16న ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేయగా, చార్మీ, మంచు లక్ష్మి ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ అయ్యారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమెతుది శ్వాస విడిచారు.
సెలబ్రిటీ యోగ ట్రైనర్..
2003 నుండి సెలబ్రిటీ యోగ ట్రైనర్ గా పనిచేసిన ఈమె భారత్ ఠాకూర్ ఈమెకు యోగా గురువుగా ఉండేవారు.. ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ప్రభాస్, తమన్నా, ఇలియానా వంటి ఇతర తారలకు యోగా ట్రైనర్ గా పనిచేశారు. ఇకపోతే ఈమె మరణం ఫిలిం ఇండస్ట్రీని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా, అదే కారణంతో సెంథిల్ కుమార్ తన పనులు అన్నింటికి విరామం పలికి భార్య కోసమే సమయాన్ని కేటాయించారు. కానీ ఆమె ఆరోగ్యం కోలుకోలేకపోయింది. దీంతో మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె తుది శ్వాస విడిచారు. ఇకపోతే రూహీ , సెంథిల్ కుమార్ 2009లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య మరణం నుంచి తేరుకోక ముందే తల్లి మరణం ఆయనను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.