బాలీవుడ్ బాద్ షా, షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్ల సందడి ప్రారంభమైంది. షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపిక పదుకొణెల కాంబినేషన్లో సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం పఠాన్. ఈ చిత్రాన్ని యశో చోప్రా బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ టీజర్ని ఒకసారి పరిశీలించినట్టయితే.. ఏం తెలుసు నీకు పఠాన్ గురించి.. అనే డైలాగ్తో ప్రారంభం అవుతుంది. మూడేళ్లుగా అతని గురించి ఏ కబురు లేదు. తన లాస్ట్ మిషన్లో అతను పట్టుబడ్డాడు. అతన్ని చాలా టార్చర్ చేశారని విన్నాం. ఇప్పుడు పఠాన్ బతికి ఉన్నాడో లేడో తెలియదు అనే డైలాగ్ రాగానే పఠాన్ బతికే ఉన్నాడనే డైలాగ్ తో యాక్షన్ సీన్లు అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో దీపిక పదుకొణె కూడా అందాలను ఆరబోసింది. చివరకు మళ్లీ ఓ మిషన్ కోసం తిరిగి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇందులో జాన్ అబ్రహాం విలన్ గా నటించినట్టు తెలుస్తోంది. యాక్షన్ హీరోగా షారూఖ్ పఠాన్ టీజర్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఈ మధ్య కాలంలో షారూఖ్ ఖాన్ నటించిన సినిమాలు ఏవి కూడా అంతగా ఆకట్టుకుంటలేవనే చెప్పాలి. చివరగా జీరో అనే సినిమాను ఐదేళ్ల కిందట తీశారు. ఇక అప్పటి నుంచి షారూఖ్ సినిమాల్లో నటించడమే మానేశాడు. మధ్యలో కొన్ని సినిమాలు నిర్మించినప్పటికీ అవి కూడా కాస్త బెడిసికొట్టాయి. చాలా గ్యాప్ తీసుకొని వస్తున్న పఠాన్ సినిమా అయినా ఆకట్టుకుందో లేదో వేచి చూడాలి మరి.