Shalini AjithKumar : మెగాస్టార్ చిరంజీవి నటించిన “జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమా అప్పట్లో ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. 1990 లో ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ తో పాటు వరదలు వచ్చాయి. అయినా సరే లాంగ్ రన్ లో ఈ సినిమా ఆడి ఘన విజయం సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటన ఒకెత్తు అయితే, శ్రీదేవి అభినయం మరో ఆకర్షణ. ఇక ఈ సినిమాలో వీరి తర్వాత ఎక్కువ సేపు ఉండేది చిరంజీవి తో ఉండే బాల నటులు. ఆ బాలనటులే బేబి షాలిని, బేబి షామిలీ, మరియు రిచర్డ్స్ రిషి అని తెలిసిందే. వీరు కూడా తమ చక్కని నటనతో సినిమా విజయానికి కారణమయ్యారు. ఇక వీళ్ళు ముగ్గురు అన్నాచెల్లెళ్లు అని తెలిసిందే. ఇక ఈ ముగ్గురూ సినిమాలు చేస్తూనే పెద్దవారు అయి, పలు సినిమాల్లో హీరోయిన్లుగా, రిచర్డ్స్ హీరోగా నటించారు. ఇక రిచర్డ్స్ నటుడుగా కొనసాగుతుండగా, షాలిని అప్పట్లోనే మణిరత్నం ‘సఖి’ లాంటి చిత్రాలతో ఓ రేంజ్ స్టార్ హీరోయిన్ గా ఊపేసిన సంగతి తెలిసిందే. ఇక షామిలి కూడా ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ ముగ్గురు మెగాస్టార్ చిరంజీవిని తాజాగా కలిసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
జగదేకవీరుడితో మెగా పిక్ వైరల్..
అయితే ఇప్పుడు షాలిని మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఆసక్తిని కలిగిస్తోంది. షాలిని పెద్దయ్యాక కథానాయికగాను నటించింది. అయితే ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్ సరసన నటించే క్రమంలోనే అతడితో ప్రేమలో పడి తర్వాత పెళ్లాడేసింది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడానూ. ఇదిలా ఉండగా ఇటీవల షాలిని మెగా క్లిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పిక్ లో చిరంజీవితో షామిలి, షాలిని, అలాగే రిచర్డ్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవిని కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ రీసెంట్ గా ‘విశ్వంభర’ సెట్స్ లో కలుసుకున్నారు. ఇది వారి అభిమానులను ఆనందపరిచింది. ఇంతలోనే అజిత్ భార్య షాలిని ఒక ఊహించని త్రోబాక్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసారు. తన మొదటి ఇన్స్టాగ్రామ్ రీల్ లో షాలిని తాను, చిరంజీవి, ఆమె సోదరి షామిలీ.. నటుడు రిచర్డ్ రిషి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.
34 ఏళ్ళ తర్వాత మెగా పిక్ అంటూ షేర్..
అయితే అభిమానులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఈ ఫోటోలో ఉన్న ప్రతి ఒక్కరూ చిరంజీవి మెగా బ్లాక్బస్టర్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి లో నటించారు. 34 సంవత్సరాల తర్వాత అదే మెగాస్టార్తో ఉన్న పాత ఫోటో ఒక దానిని షాలిని (Shalini AjithKumar) ఇప్పుడు షేర్ చేసింది. ఈ నోస్టాల్జిక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ పిక్ చూసిన మెగాభిమానులు, అలాగే అజిత్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి త్రిష జంటగా నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. మల్లిడి వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం 10 జనవరి 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత చిరంజీవి మోహన్ రాజా తో మరో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.