Shalini Pandey: ఆ పని కోసం మగాళ్ళతో రూమ్ షేర్.. కట్ చేస్తే..!

Shalini Pandey.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో కైనా సరే అబ్బాయిలు త్వరగానే అడుగుపెట్టేసి.. సక్సెస్ అవుతారు.. కానీ అమ్మాయిలు అలా కాదు.. దర్శకుల నుంచి నిర్మాతల వరకు ప్రతి ఒక్కరి చేత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని. వాటన్నింటినీ అధిగమించి స్టార్ పొజిషన్ కు చేరుకోవాలి అంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అలా ఇండస్ట్రీలోకి రావడానికి ముందుగా కుటుంబ సభ్యులను ఒప్పించి.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ ఎదురయ్యే సమస్యలను అధిగమించి. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న వారిలో శాలిని పాండే కూడా ఒకరు.. ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి.. ఆ పని కోసం మగాళ్ళ తో రూమ్ షేర్ చేసుకొని.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను పడిన కష్టాలను శాలిని పాండే స్వయంగా వెల్లడించింది అవేంటో ఇప్పుడు చూద్దాం..

Shalini Pandey: Share a room with men for that work.. if cut..!
Shalini Pandey: Share a room with men for that work.. if cut..!

ఫ్రెండ్స్ తో ఉండలేక మగాళ్ళతో రూమ్ షేర్ చేసుకున్నా..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శాలిని పాండే మాట్లాడుతూ.. ఇండస్ట్రీ లోకి వస్తానంటే నా తండ్రి ఒప్పుకోలేదు.. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేయాలన్నది మా నాన్న కోరిక.. కానీ నా కల వేరే.. అందుకే నాన్నను ఎలాగైనా సరే ఒప్పించి ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను.. కానీ సినిమాల్లోకి రావాలనుకున్న నా ఆశ తల్లిదండ్రులను ఒప్పించేంత వరకు ఆగలేకపోయింది.. సినిమాల్లోకి రావాలని చదువు మధ్యలోనే మానేసి ఇంటి నుండి పారిపోయి ముంబై వచ్చా. అక్కడ నా స్నేహితుల రూమ్ లో ఉన్నాను.. వారితో ఉండడం నచ్చలేదు ఆ తర్వాత మగవాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది.. అయినా భయపడలేదు.. కనీసం తిండి కూడా దొరికేది కాదు.. ఒకటే రూమ్ …బట్టలు మార్చుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు.. అయినా సరే భయపడకుండా వారితోనే ధైర్యంగా ఉన్నాను.. వాళ్ళ మధ్య ఉన్నా కానీ చాటుగా ఉంటూ బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అవకాశం ఇచ్చారు..

అలా సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న సమయంలోనే అర్జున్ రెడ్డి సినిమాలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నాకు అవకాశం ఇచ్చారు.. నేను చేసింది మొదటి సినిమా అయినా ఈ చిత్రం నాకు మంచి విజయాన్ని అందించింది.. ఇందులో విజయ్ దేవరకొండ సరసన నాకు నటించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం.. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోవడంతో నా కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత మహానటిలో కీలకపాత్ర పోషించాను. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నాను..

- Advertisement -

ఆ ధైర్యమే నేడు ఈ స్థాయి అందించింది..

ఆరోజు గనుక నేను భయపడి వెనుకడుగు వేసి ఉంటే.. ఈరోజు మా నాన్న చెప్పినట్టు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎక్కడో ఏదో ఒక మూల ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని..కానీ నా కోరికను నెరవేర్చుకోవడానికి నాడు ధైర్యం చేయడం వల్లే.. నేడు అందరి దృష్టిలో ఉండగలిగాను అంటూ చెప్పుకొచ్చింది శాలిని పాండే ప్రస్తుతం శాలిని పాండే చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు