Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనంతరం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. త్రిబుల్ ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు . ఇక ప్రస్తుతం ఒకపక్క టాలీవుడ్ తో పాటు మరోపక్క బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు.
ఇక ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఓ షోలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిగ్గుండాలి మనకు అని తలదించుకుని తారక్ మాట్లాడిన వీడియో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ మాటలు అన్నది మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో. అది కూడా ప్రముఖ కవి గుర్రం జాషువా పద్యాలకు సంబంధించిన విషయంలో. మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో గుర్రం జాషువా రాసిన పదానికి సంబంధించి ఓ ప్రశ్న వచ్చింది. కానీ దానికి అతను సమాధానం చెప్పలేకపోతాడు.
దానికి ఆన్సర్ జూనియర్ ఎన్టీఆర్కు కూడా తెలియదని అంటాడు. అప్పుడు ఆడియన్స్ లో ఉన్న ఎనిమిదవ తరగతి చదువుకున్న పాప ఆ క్వశ్చన్ కు..ఆన్సర్ చెబుతుంది. అది చూసిన తారక్.. మాకు ఎనిమిదవ తరగతిలో గుర్రం జాషువా గారిపై లెసన్స్ ఉన్నాయి. కానీ మాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుండాలి మనకు.. అంటూ కామెంట్స్ చేశారు.