Shivam Bhaje : నిర్మాతలను మోసగించిన కేసులో అశ్విన్ బాబు హీరోయిన్‌కి ఊరట… అసలేం జరిగిందంటే..?

Shivam bhaje.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అశ్విన్ బాబు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటించిన చిత్రం శివం భజే. ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయన ఈ సినిమాతో హిట్ అనిపించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగన సూర్యవన్శీ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Shivam Bhaje : Ashwin Babu's heroine gets relief in the case of cheating the producers... What actually happened..?
Shivam Bhaje : Ashwin Babu’s heroine gets relief in the case of cheating the producers… What actually happened..?

హీరోయిన్ దిగంగనకు కోర్టు నుండి బిగ్ రిలీఫ్..

ఆగస్టు ఒకటవ తేదీన శివం భజే సినిమా థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ప్రముఖ డైరెక్టర్ అప్సర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మహేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇకపోతే దిగంగన హీరోయిన్ గానే కాదు సింగర్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మ మల్టీ టాలెంటెడ్ గా పేరు కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు బిగ్ రిలీఫ్ లభించింది అని తెలుస్తోంది. అసలు విషయంలోకెళితే గతంలో ఈమెపై కేసు నమోదు చేయగా తాజాగా ఈ ఆ కేసును కోర్టు కొట్టి వేసింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

గతంలో దిగంగనాపై కేస్ ఫైల్..

ఈ సంవత్సరం జూన్లో ఎంహెచ్ ఫిలిం , మనీష్ ప్రొడక్షన్ హౌస్ మేకర్స్ వారు దిగంగన తమను మోసం చేసింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షో స్టాపర్ వెబ్ సిరీస్ కి హోస్టుగా నటుడు అక్షయ్ కుమార్ ను తీసుకొస్తానని తమ వద్ద డబ్బులు తీసుకుందట. అంతేకాదు తనకు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ బడా హీరోలతో పరిచయాలు ఉన్నాయని చెప్పిందట. అయితే అవేవీ జరగలేదని డబ్బు తీసుకొని తమల్ని మోసం చేసింది అంటూ హరి శంకర్ ఆరోపించారు. అంతేకాదు బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిందని కూడా ఆమెపై ఆరోపించారు.

- Advertisement -

దీంతో ఈ విషయం కాస్త అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాలపై స్పందించిన దిగంగన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపింది. హరిశంకర్ పై పరువు నష్టం కేసు వేసి నోటీసులు అందించేలా చేసింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా పోలీసులకు వివరించింది. షో స్టాపర్ అనే వెబ్ సిరీస్ లో జరీనా వహాబ్ , జీనత్ అమన్, శ్వేతా తివారీ, సౌరభ్ రాజ్ జైన్ తదితరులు నటించారు అయితే ఈ సీరీస్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా చాలామంది నటీనటులతో పాటు సిబ్బందికి కూడా రెమ్యునరేషన్ చెల్లించలేదని నిర్మాతపై వారు ఫిర్యాదు కూడా చేశారు. ఇక నిజానిజాలు తెలుసుకున్న కోర్టు తాజాగా కేసు కొట్టి వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే శివం భజే హీరోయిన్ దిగంగన సూర్యవన్శీ ఈ సమస్య నుంచి బయటపడిందని తెలుస్తోంది. మొత్తానికి అయితే సినిమా విజయం , మరొకవైపు కేస్ నుంచీ ఊరట రెండూ కూడా ఒక భారీగా కలిసి వచ్చాయి అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు