సాధారణంగా పండుగల సమయంలో పెద్ద హీరోల సినిమాలు రావడం కామన్. ఒక్కో పండుగకి ఒక్కో హీరో పోటీలో ఉంటారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-బాలకృష్ణ వీరిద్దరూ చాలా సందర్భాల్లో పండుగలకు పోటీలో ఉన్నారు. ఒకసారి ఒకరు విజయం సాధిస్తే మరోసారి మరొకరు విజయం సాధిస్తారు. కొన్నిసార్లు ఇద్దరూ విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఖైదీ నెం 150 సినిమాతో వస్తే.. నందమూరి నటసింహం బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఇద్దరూ విజయం సాధించడం విశేషం.
మరో ఆసక్తికర విశేషమేంటంటే యూఎస్లో చిరంజీవి ఖైదీ నెం. 150 కంటే బాలయ్య గౌతమిపుత్రశాతకర్ణి సినిమానే ఎక్కువ వసూలు చేయడం విశేషం. తాజాగా 2023 సంక్రాంతి పండుగకి చాలా సినిమాలే విడుదలవుతున్నాయి. అందులో ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఒకటి కాగా.. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి, తమిళ హీరో విజయ్ దళపతి-తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న వారసుడు వంటి సినిమాలు సంక్రాంతి రేస్లో ఉన్నాయి.
అయితే యూఎస్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య రూ.7 కోట్లుకు, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి హక్కులు రూ.3.80 కోట్లకు శ్లోక సినిమాస్ దక్కించుకుంది. మరోవైపు దిల్ రాజు నిర్మించిన విజయ్ దళపతి సినిమా హక్కులను కూడా అదే సంస్థ విక్రయించడం విశేషం. సంక్రాంతి పండుగకి ఒకే సంస్థ మూడు సినిమాలను డీల్ చేయడం అంటే పెద్ద సవాల్ తో కూడినదే అనే చెప్పాలి. ఈ సినిమాల ద్వారా ఆ సంస్థకి ప్లస్ అవుతుందో మరి మైనస్ అవుతుందో చూడాలి. మరోవైపు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాని ఎవ్వరూ కొనుగోలు చేశారన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సంక్రాంతి బరిలో వచ్చే సినిమాల్లో ఏ హీరో విజయం సాధిస్తాడో వేచి చూడాలి మరి.