Shruti Hassan : స్టార్ హీరోకు ఇచ్చినపడేసిన శృతి… చెర్రీ మ్యాటరేనా?

Shruti Hassan : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరోయిన్లలో శృతి హాసన్ కూడా ఒకరు. ఈ లక్కీ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు ఇచ్చి పడేసింది. అయితే ఆమె రిప్లై చెర్రీ ఇన్సిడెంట్ కి కనెక్ట్ అవుతుండడం విశేషం. మరి ఇంతకీ ఆ నెటిజన్ కామెంట్ ఏంటి ? శృతి హాసన్ ఇచ్చిన రిప్లై ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

సౌత్ యాసపై సెటైర్లు

తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఇంస్టాగ్రామ్ లో ఆస్క్ మీ సంథింగ్ సెషన్ ను నిర్వహించింది. పలువురు అభిమానులు శృతి హాసన్ ను పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు. కానీ ఓ నెటిజన్ మాత్రం విచిత్రమైన ప్రశ్న అడగడంతో శృతి హాసన్ సహనం నశించి సమాధానం స్ట్రాంగ్ గానే ఇచ్చింది. దక్షిణ భారత యాసలో ఏదో ఒకటి చెప్పండి? అని అడిగాడు ఆ నెటిజన్. దీంతో శృతి హాసన్ కి అసౌకర్యంగా అనిపించింది అని ఆమె సమాధానం చూస్తేనే తెలుస్తోంది. దీన్ని జాత్యహంకారం అని పేర్కొన్న శృతి హాసన్ అతనికి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది.

Shruti Haasan reacts against a racist comment (Credit: Instagram)ఇదొక విధమైన జాత్యహంకారం. ఎలా పడితే అలా పిలిస్తే కామెడీగా తీసుకోము. మీరు మమ్మల్ని చూసి ఇడ్లీ, దోశ, సాంబార్ అని పిలిస్తే మేము సహించము. మీరు ఎలాగూ మమ్మల్ని ఇమిటేట్ చేయరు కాబట్టి మాలా ఉండాలని ట్రై చేయకండి అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ ఇచ్చిన ఈ ఘాటు సమాధానం వైరల్ అవుతుంది. అయితే దీన్ని ఎక్కడో కనెక్ట్ చేసి ఓ బడా హీరోకి శృతి హాసన్ ఇచ్చి పడేసింది అని సంతోష పడుతున్నారు మెగా అభిమానులు.

- Advertisement -

చెర్రీ మ్యాటరేనా?

కొన్ని నెలల క్రితం మెగాస్టార్ రామ్ చరణ్ కు అవమానకర ఘటన ఎదురైన విషయం తెలిసిందే. జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు పలువురు బాలీవుడ్ బడా స్టార్లతో పాటు రామ్ చరణ్ దంపతులకు కూడా ఆహ్వానం అందింది. అక్కడ వేదికపై ట్రిపుల్ ఆర్ పాటకు స్టెప్పు లేశారు ఖాన్ల త్రయం. ఆ తర్వాత రామ్ చరణ్ ని స్టేజిపైకి పిలిచే క్రమంలో షారుక్ ఇడ్లీ సాంబార్ వడ రామ్ చరణ్ ఎక్కడున్నా రావాలి అంటూ ఫన్నీగా పిలిచాడు.

కానీ ఇది సౌత్ మూవీ లవర్స్ మనోభావాన్ని దెబ్బతీసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయనను షారుక్ ను ట్రోలింగ్ ద్వారా ఓ ఆట ఆడుకున్నారు. తాజాగా శృతి హాసన్ కూడా ఇడ్లీ, దోస సాంబార్ అంటూ సమాధానం ఇవ్వడంతో ఈ ఇన్ డైరెక్ట్ చెంపపెట్టు ఆయనకేనని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఏదైతేనేం అప్పుడు ఎవరూ మాట్లాడలేదు గానీ సందర్భం వచ్చినప్పుడు శృతి హాసన్ మాత్రం ఇచ్చి పడేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు