Shruti Sharma : అతనితో రొమాన్స్ వల్ల ఒళ్ళంతా దద్దుర్లు… హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Shruti Sharma : సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం అనేది ఈరోజుల్లో సర్వసాధారణంగా మారింది. కానీ చాలా మందికి అసలు అంత మంది ముందు, కెమెరాల ముందు అసలు ఒక అమ్మాయి అబ్బాయి ఎలా రొమాన్స్ చేస్తారు ? ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అనే డౌట్స్ ఉంటాయి. వాళ్ళ డౌట్స్ తీర్చడానికే అన్నట్టుగా తాజాగా ఓ యంగ్ హీరోయిన్ ఏకంగా హీరోతో రొమాన్స్ చేసిన తర్వాత ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అంటే…

ప్రస్తుతం ఓటీటీలో హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి మొట్టమొదటి వెబ్ సిరీస్ హీరామండి. ఆయన సినిమాలు ఎంతటి రిచ్ లుక్ లో ఉంటాయో ఈ వెబ్ సిరీస్ కూడా అలాగే ఉంది. ఇక వేశ్యల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, శృతి శర్మ లాంటి హీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషించడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో హీరామండీ వెబ్ సిరీస్ భారీ సంఖ్యలో వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు ఒక్కొక్కరుగా షూటింగ్ చేస్తున్న టైంలో తమకు ఎదురైన పలు సంఘటనలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా షూటింగ్ టైంలో రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు ఎలా ఫీలయిందో చెప్పేసింది. మరోవైపు మనీషా కొయిరాలా తను డిప్రెషన్ కు గురయ్యాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే శృతి శర్మ కూడా తాజాగా తన రొమాంటిక్ సన్నివేశాల గురించి మాట్లాడింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి శర్మ ఈ సిరీస్ షూటింగ్ చేస్తున్న టైంలో ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. శృతి శర్మ మాట్లాడుతూ రజత్ కౌల్ తో తన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసింది. ఆ సీన్లలో ఇద్దరం కలిసి చాలా సహజంగా నటించామని చెప్పింది ఈ యంగ్ హీరోయిన్. ఇప్పటి వరకు తాను అలాంటి సన్నివేశాలు ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చింది. దుమ్ము, ధూళి లాంటివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక రోజంతా ఆ సీన్ల కోసం కష్టపడి ఎట్టకేలకు కంప్లీట్ చేశామని వెల్లడించింది. అయితే అతనితో రొమాంటిక్ సీన్లు చేస్తున్న సమయంలో తన శరీరం పై దద్దుర్లు వచ్చాయి అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.

- Advertisement -

ఇక హీరామండీ వెబ్ సిరీస్ లో తను పోషించిన సైమా పాత్ర పట్ల సంతోషంగా ఉన్నానని, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి అనుకున్న రోల్ సహజంగా రావడానికి తను చాలా కష్టపడ్డానని ఈ సందర్భంగా తెలిపింది శృతి. కాగా తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు