Shweta Shinde : ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటనలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. తాజాగా మరో నటి ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఓ నటి ఇంట్లో చోరీకి గురైన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ చోరీ తర్వాత దొంగతనం ఎవరు చేసి ఉంటారు అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
అసలు విషయం ఏమిటంటే?
ప్రముఖ మరాఠీ నటి, నిర్మాత శ్వేతా షిండే ఇంట్లో చోరీ జరిగింది. సతారాలోని శ్వేత ఇంట్లో ఏఎ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. శ్వేత సతారా నగరంలోని పిర్వాడి ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తుంది. చోరీ జరిగిన సమయంలో ఆమె ఇంట్లో ఎవరూ లేరు. శ్వేతా షిండే పని మీద ముంబైకి వచ్చింది. ఆమె ఇంట్లో లేని సమయంలోనే ఈ చోరీ జరిగింది. తిరిగి వచ్చాక దొంగతనం జరిగింది అన్న విషయాన్ని గమనించి, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డబ్బు, బంగారం మాయం
సమాచారం ప్రకారం జూన్ 3న శ్వేతా షిండే ఇంట్లో దొంగతనం జరిగింది. పది తులాల విలువైన ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. శ్వేతా లేని సమయం చూసి దొంగలు డబ్బుతో పాటు భారీగా బంగారాన్ని కూడా దోచుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై శ్వేతా షిండే మాట్లాడుతూ.. దొంగతనం జరిగినప్పుడు నేను ముంబై వెళ్లాను. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో మా అమ్మ ఇంట్లో లేదు అని అన్నారు. అయితే ఎంత డబ్బు చోరీకి గురైందో కచ్చితంగా చెప్పడం కష్టమని ఆమె అన్నారు. ఒక పౌరురాలిగా పోలీసులకు ఫిర్యాదు చేశాను. మిగతా బాధ్యత పోలీసులదే అని చెప్పుకొచ్చారు శ్వేత.
యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ను కూడా నిర్వహిస్తున్న శ్వేతా షిండే ఇంట్లో చోరీ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నటి కుటుంబం సురక్షితంగా ఉంది. ఈ వ్యవహారంపై శ్వేత ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, పోలీసులు త్వరలోనే దొంగలను కనుగొంటారని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ చోరీ కేసులో పోలీసులు ఇంతవరకు ఏమీ వెల్లడించలేదు. కానీ దొంగతనం జరిగింది అన్న విషయం తెలిసిన అనంతరం ఆ ప్రాంతంలో కలకలం రేగుతోంది.
శ్వేత షిండే ఎవరు?
ఇదిలా ఉంటే శ్వేతా షిండే చాలా సీరియల్స్, సినిమాలలో నటించింది. అయితే ప్రస్తుతం శ్వేత నటనకు దూరంగా ప్రొడక్షన్ రంగంలో పని చేస్తోంది. శ్వేత నిర్మించిన ‘జీ మరాఠీ’ ఛానెల్లో ‘అప్పి ఆమ్చి కలెక్టర్’ అనే సీరియల్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. త్వరలో శ్వేత నిర్మిస్తున్న కొత్త సీరియల్ ‘లఖత్ ఏక్ అమోహన్ దాదా’ ‘జీ మరాఠీ’లో ప్రారంభం కానుంది. ఈ సీరియల్లో నటుడు నితీష్ చవాన్, నటి దిశా పరదేశి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.