Simbu new Controversy : అడ్వాన్స్ తీసుకుని మూవీ ఎగ్గొట్టాడు…. కొత్త వివాదంలో ఇరుక్కున్న శింబు

Simbu new Controversy : కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ అయిన కోలీవుడ్ స్టార్ సిలంబరసన్ టిఆర్‌ (శింబు)పై ప్రముఖ తమిళ నిర్మాత ఫిర్యాదు చేయడంతో ఆయన తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆ వివాదం వివరాల్లోకి వెళ్తే…

ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నథగ్ లైఫ్‌లో కీలక పాత్ర పోషిస్తానని ప్రకటించినప్పటి నుండి సిలంబరసన్ టిఆర్ (శింబు) ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ సమయంలో శింబు ఓ కొత్త వివాదాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తోంది.

వివాదం ఇదే..

అసలు వివాదం ఏంటంటే.. వేల్స్ ప్రొడక్షన్‌కు చెందిన తమిళ సినీ ప్రముఖ నిర్మాత ఈషారి కె గణేష్ శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, శింబు నిర్మాతతో ఓ మూవీకి డీల్ కుదుర్చుకుని అడ్వాన్స్ గా పేమెంట్ కూడా అందుకున్నాడు. అయితే ఆ తరువాత శింబు స్వయంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అలాగని అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదు. కనీసం ఎందుకు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు అనే రీజన్ ను కూడా కనీసం నిర్మాతలకు చెప్పలేదట శింబు.

- Advertisement -

ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత నుండి సిలంబరసన్ టిఆర్ థగ్ లైఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారింది. రూమర్స్ ప్రకారం, సిలంబరసన్ టిఆర్ (శింబు) తన గత చిత్రం వెందు తనింధతు కాదు తర్వాత ఈశారి కె గణేష్ నిర్మించిన చిత్రంలో నటించాల్సి ఉంది. కరోనా కుమార్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ చిత్రానికి గోకుల్ ఎన్ కృష్ణను దర్శకుడిగా అనుకున్నారు. అయితే చిత్రీకరణ ప్రారంభం కాకముందే, కారణం ఏంటో చెప్పకుండానే శింబు ప్రాజెక్ట్ నుండి తప్పుకుని నిర్మాతలకు షాక్ ఇచ్చారు.

అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదు

ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ గా రెమ్యూనరేషన్ తీసుకున్న శింబు సినిమా నుంచి తప్పుకున్నా కూడా నిర్మాతలకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగని కనీసం అదే నిర్మాతలు నిర్మిస్తున్న ఇతర చిత్రాలకు కమిట్ అవ్వలేదని సమాచారం. శింబు తీరుతో విసిగిపోయిన నిర్మాత ఈశారి కె గణేష్ చివరకు అతనిపై ఫిర్యాదు చేయాలని  నిర్ణయించుకున్నారు.

నిర్మాతల డిమాండ్ ఇదే..

నిర్మాత ఈశారి కె గణేష్ ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారంటే.. శింబు అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చే వరకు లేదా అదే మేకర్స్ తో మరొక ప్రాజెక్ట్‌ చేయడానికి ఒప్పుకునేదాకా అతను ఇతర ప్రాజెక్ట్‌లలో భాగం కావడానికి అనుమతించరాదని నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. శింబు ప్రస్తుతం కమల్ హాసన్ తదుపరి చిత్రం థగ్ లైఫ్ షూటింగ్‌లో ఉన్నాడు. శింబు లైన్-అప్ లో STR 48 అనే మరో ప్రాజెక్టు కూడా ఉంది.

మొత్తానికి నిర్మాత ఈషారి కె గణేష్ శింబు నటిస్తున్న థగ్ లైఫ్ కి ఎసరు పెడుతున్నారు. మరి ఆయన కంప్లయింట్ నేపథ్యంలో నిర్మాతల మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు