Sj Surya: ఇండియన్ 2 సినిమా పై సంచలన నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Sj Surya: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ఎస్ జె సూర్య ఒకరు. అయితే నటుడి కంటే ముందు ఎస్ జె సూర్య ఒక దర్శకుడిగా చాలామందికి పరిచయమని చెప్పొచ్చు. ఎస్ జె సూర్య దర్శకుడుగా కూడా మంచి హిట్ సినిమాలును అందుకున్నాడు. కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య పరిచయం. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషి సినిమాని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది. ఈ సినిమా తర్వాతే దాదాపు 10 ఏళ్లపాటు పవన్ కళ్యాణ్ కి హిట్ సినిమా పడలేదు.

ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు

ఇకపోతే ఖుషి సినిమా ఒరిజినల్ గా ముందు తమిళ్లో తెరకెక్కింది. ఆ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఇదే విషయాన్ని ఎడిటర్ మార్తాండ కే వెంకటేష్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. యాక్షన్ సీక్వెన్సెస్ సాంగ్స్ కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అలానే ఈ సినిమాలో మొదటి సాంగ్ ఐడియా కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చినందుకు ఎస్ జె సూర్యను గుర్తుపెట్టుకుంటారు తెలుగు ఆడియన్స్.

మహేష్ బాబును కూడా డైరెక్ట్ చేసాడు

ఇకపోతే తెలుగులో నాని అని మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ మహేష్ బాబుకి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. మళ్లీ ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో కొమరం పులి అని ఒక సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

- Advertisement -

నటుడుగా గుర్తింపు

ఇక రీసెంట్ టైమ్స్ లో ఎస్ జె సూర్య నటుడుగా కూడా నిలదొక్కుకుంటున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు సూర్య. అలానే మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక విలన్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమాతో సూర్యకి మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా వస్తున్న తమిళ్ సినిమాల్లో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

Indian 2

ఇండియన్ టు సినిమాలో విలన్ గా

ఇండియన్ 2 సినిమాలో  ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కమలహాసన్ కి సూర్య కి మధ్య సీన్స్ చాలా హైలెట్ గా ఉండబోతున్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో సిద్ధార్థ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అలానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. జులై 12 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు