SriReddy: మెగా ఫ్యామిలీని మళ్ళీ కెలికిన శ్రీరెడ్డి..శ్రీజ మాజీ భర్త మృతితో..!

Sri Reddy.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.. అటు మెగాస్టార్ కుటుంబం నుంచి చాలామంది ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎదగడం జరిగింది. అయితే చిరంజీవి పిల్లలకు సంబంధించి ఎప్పుడూ కూడా ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈ రోజున మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే శిరీష్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజాను వివాహం చేసుకున్నారు.. కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. శ్రీజ, శిరీష్ కు ఒక పాప కూడా ఉంది.. విడాకులు తీసుకున్న అనంతరం ఎవరి జీవితాన్ని వారు గడిపారు. తాజాగా శిరీష్ లంగ్స్ కి సంబంధించిన సమస్యతో గత కొద్దిరోజుల నుంచి చికిత్స తీసుకుంటూ మరణించినట్లు తెలుస్తోంది.

శ్రీజ శిరీష్ పెళ్లి వెనుక రాజకీయ ప్రభావం..

Sri Reddy: Sri Reddy who won Mega Family again.. with the death of Srija's ex-husband..!
Sri Reddy: Sri Reddy who won Mega Family again.. with the death of Srija’s ex-husband..!

వృత్తిరీత్యా శిరీష్ లాయర్ కావడంతో తన వృత్తిని కొనసాగిస్తూ ఉండేవారు.. అంతేకాకుండా చిరంజీవి కూతురు నుండి విడాకులు పొందిన తరువాత రెండో వివాహాన్ని కూడా చేసుకున్నారు శిరీష్.. 2007లో శ్రీజాను శిరీష్ ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లి ఒక దుమారాన్ని సైతం సృష్టించింది… దీని వెనుక రాజకీయ ప్రభావం ఉందని వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు విడాకులు తీసుకోవడంతో శిరీస్ రెండో పెళ్లి ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకున్నారు.

అదనపు కట్నమే ఇద్దరి మధ్య చిచ్చు.

ఇక శ్రీజ తల్లిదండ్రులు చూపించిన కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. శ్రీజ శిరీష్ విడిపోవడానికి ముఖ్య కారణం అదనపు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నాడంటూ.. 2012వ సంవత్సరంలో ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలా విభేదాలు రావడంతో 2014లో వీరు వీడిపోయినట్లు తెలుస్తోంది. 2016లో బిజినెస్ మాన్ అయిన కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది శ్రీజ.

- Advertisement -

శిరీష్ భరద్వాజ్ మృతి…

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈ రోజున ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ హైదరాబాదులో ఒక ప్రముఖ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీని మళ్లీ కెలికిన శ్రీ రెడ్డి..

తాజాగా నటి శ్రీరెడ్డి.. శిరీష్ భరద్వాజ్ మృతి పైన ఒక షాకింగ్ పోస్టుని షేర్ చేసింది.. శ్రీ రెడ్డి ఇలా పోస్ట్ షేర్ చేస్తూ.. “శిరీష్ భరద్వాజ్ ఇకలేరు.. ఇప్పటికైనా నీకు శాంతి దొరుకుతుంది రా శిరీష్” అంటూ పోస్ట్ చేసింది.. అంతేకాకుండా అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఫేస్ బుక్ లో ఒక పోస్టును సైతం షేర్ చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో ఇక వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా శ్రీ రెడ్డి ఈ పోస్టును కేవలం చిరంజీవి కుమార్తె శ్రీజను ఉద్దేశించి పెట్టిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు మెగా ఫ్యామిలీని ఈమె మళ్లీ కెలికింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో..ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ పోస్టు వైరల్ గా మారుతున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు