Sridevi: ఒక్కరోజు గడపడానికి అన్ని రూ.కోట్లా.. ఆ వ్యక్తి ఎవరంటే..?

Sridevi.. దివంగత నటీమణి అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి.. 50 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో ఎంతోమందిని ఆకట్టుకుంది.. అలాంటి ఈ ముద్దుగుమ్మను పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో హీరోలు మాత్రమే కాదు బడా వ్యాపారవేత్తలు, నిర్మాతలు, దర్శకులు కూడా తెగ ప్రయత్నాలు చేసే వారట.. అందులో కొంతమంది ఈమెను పెళ్లి చేసుకోవడానికి వెనుకడుగు వేసిన వారు కూడా ఉన్నారు అనుకోండి.. కానీ ఎక్కువ మంది ఈమెను వివాహం చేసుకోవాలని ఆశపడిన వారే చాలామంది వున్నారు అనడంలో సందేహం లేదు..

Sridevi: All the Rs crores to spend one day.. Who is that person..?
Sridevi: All the Rs crores to spend one day.. Who is that person..?

శ్రీదేవి అంటే అంత మంది పడి చచ్చేవారా..

ఇకపోతే శ్రీదేవితో ఒక్కరోజైనా సమయం గడపాలని కోరుకునేవారు కొంతమంది అయితే… ఆమె కనిపిస్తే చాలు, కరచాలనం చేస్తే చాలు అని ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది .. మొత్తానికైతే శ్రీదేవి పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ప్రేమను చాటుకున్నారు.. ఏదేమైనా అప్పట్లో శ్రీదేవికి ఉండే డిమాండ్ అటువంటిది మరి.ఇకపోతే శ్రీదేవిని వివాహం చేసుకోవాలనుకున్న వారిలో రజనీకాంత్, కమలహాసన్ వంటి పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా తనకు పెళ్లి అయినా.. శ్రీదేవి తనకు రాఖీ కట్టిన సరే.. ఆమె మీద ప్రేమను చంపుకోలేక భార్యను వదిలేసి ఈమెను వివాహం చేసుకున్నారు.. అలాంటి శ్రీదేవితో ఒక్కరోజు గడపడం కోసం ఒక వ్యక్తి చేసిన పని తెలిస్తే మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిందే.. మరి ఇంతకు ఆయన ఎవరు ? ఆ వ్యక్తి ఏం చేశారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

శ్రీదేవితో ఒక్కరోజు మాట్లాడడానికి ..

ఇదిలా ఉండగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె గురించి ఎన్నో తెలియని విషయాలను బయటపెట్టారు. అప్పట్లో శ్రీదేవి దగ్గర ఈమంది రామారావు పనిచేసే వారట.. ఆయనకు 650 రూపాయల జీతం ఇచ్చేదట శ్రీదేవి.. శ్రీదేవి జీవితాన్ని చాలా దగ్గర నుండి చూసిన రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పట్లో శ్రీదేవి పై ఎంత మంది హీరోలు ప్రేమ పెంచుకున్నారు.. ఒక అరబ్ షేక్ అయితే శ్రీదేవితో ఒక్క రోజు కలిసే అవకాశం ఇవ్వమని.. నాకు వెయ్యి రూపాయలు చెక్ కూడా రాసి పంపించారు.. అంతేకాదు ఎన్నో ఉత్తరాలు కూడా పంపారు.. అయితే ఈ విషయాన్ని నేను ఒకరోజు శ్రీదేవికి చెప్పగా… తన తల్లికి ఈ మేటర్ చెప్పింది.. అయితే శ్రీదేవి తన తల్లికి తెలియకుండా ఏ పని చేసేది కాదు.

- Advertisement -

రూ.వేల కోట్లు ఖర్చు చేసిన అరబ్ షేక్..

ఇక మొత్తం విన్న శ్రీదేవి తల్లి.. ఆ అరబ్ షేక్ ను ఇంటికి పిలిపించి.. ఒక మేటర్ చెప్పిందట .. నువ్వు నా కూతురుతో ఒక్కరోజు మాట్లాడి.. భోజనం చేయాలంటే నీకు ఒక కండిషన్ పెడుతున్నాను. టీ నగర్ లోని సరస్వతి మహల్ లో 4000 గజాలలో ఒక ఇల్లు ఉంది.. దానిని కొని శ్రీదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడికి వస్తే.. అప్పుడు శ్రీదేవి నీతో మాట్లాడుతుంది అని అరబ్ షేక్ తో చెప్పింది.. దాంతో శ్రీదేవితో ఎలా అయినా సరే మాట్లాడాలని అనుకున్న ఆ అరబ్ షేక్.. చెప్పినట్టుగానే ఆ 4000 గజాల ఇంటిని కొని రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకొచ్చి శ్రీదేవి తల్లికి చూపించగా.. వెంటనే శ్రీదేవితో మాట్లాడడానికి ఆమె పర్మిషన్ ఇచ్చిందట.. ఇక అప్పట్లోనే 4000 గజాల ఇల్లు అంటే ఇప్పుడు దాని విలువ ఎన్ని కోట్లు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా అప్పట్లోనే శ్రీదేవి అంటే ఎంతోమంది పడి చచ్చేవారు అంటూ ఆయన వెల్లడించారు. మొత్తానికి అయితే శ్రీదేవి డిమాండ్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు