Srinu Vaitla-Gopi Mohan: చాలా ఏళ్ళ తర్వాత

ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ముద్ర ఉండేది. శ్రీను వైట్ల కెరియర్ లో వచ్చిన “ఢీ” సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమానే అతనికి దర్శకుడిగా స్టార్ డం తీసుకువచ్చింది. దీని తర్వాత శ్రీనువైట్ల వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా కెరియర్ జట్ స్పీడుతో కొనసాగింది. ఇక అతని కెరియర్ అంత స్పీడ్ గా వెళ్లడానికి కారణం వెనకుండి నడిపించిన కోన వెంకట్, గోపి మోహన్ దే అని చెప్పవచ్చు. అయితే శ్రీను వైట్ల – గోపి మోహన్ ల మధ్య వివాదాల కారణంగా వీరి కాంబినేషన్ లో సినిమాలు ఆగిపోయాయి. అయితే శ్రీను వైట్ల ఏ కథనైనా ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నాడు అని.. అతని డైరెక్షన్లో వచ్చే సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు.

ఆగడు చిత్రంతో మొదలైన డిజాస్టర్లు బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాల వరకు ఆగలేదు. అయితే తాజా సమాచారం మేరకు మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత శ్రీను వైట్ల మరోసారి గోపి మోహన్ తో సినిమా చేయబోతున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో మొదలుకానున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో నటించే హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న శ్రీనువైట్ల మరోసారి తన లక్కీ రైటర్ తో కలిసి చేయబోతున్న సినిమా తనకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు