SriReddy: పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్..!

SriReddy.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.. జూన్ 26వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభించారు.. ఈ దీక్ష 11 రోజులు పాటు కొనసాగనుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అమ్మవారి బట్టల్లో చెప్పులు వేసుకుని దర్శనం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.. పైకి చూడడానికి ఎంతో పద్ధతిగా నుదుటన బొట్టు.. పసుపు రంగు అమ్మవారి బట్టల్లో జనాలను ఆకట్టుకున్నప్పటికీ.. కింద చెప్పులు ధరించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అమ్మవారి దీక్షలో ఉండి చెప్పులు వేసుకోవడం ఏంటి? అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరీ కాంట్రవర్సీకి గురి చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి పెంచలన పోస్ట్..

SriReddy: SriReddy's sensational post on Pawan Kalyan..!
SriReddy: SriReddy’s sensational post on Pawan Kalyan..!

అయితే ఈ విషయంపై శ్రీరెడ్డి కూడా సంచలన పోస్ట్ చేసింది.. పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకున్న అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. పవన్ పిక్ కి.. బిజెపిని మెప్పించడానికి.. చెప్పుతో దీక్షలు .. వాట్ ఏ హిందూ ఫాలోవర్.. అంటూ రెండు పగలబడి నవ్వే ఎమోజీలను కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ కూడా చెప్పులు వేసుకుని దీక్ష మొదలుపెట్టాడు అంటూసెటైరికల్కా మెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు

దీక్షలో భాగంగా అల్పాహారం మాత్రమే..

ఇకపోతే దీక్షలో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేవలం పండ్లు , పాలు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారట. గత సంవత్సరం జూన్ నెలలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే..ఈ యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు ..ఎన్నో ఫెయిల్యూర్ తర్వాత 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించారు. గత 13 ఏళ్లుగా ఎన్నో విమర్శలను, సవాళ్లను ఎదుర్కొన్న జనసేనాని .. వాటన్నింటిని దిగమింగుకొని ఇప్పుడు విజయం సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు శ్రీరెడ్డి పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధమైన క్లారిటీ ఇస్తారో చూడాలి.

- Advertisement -

పవన్ కళ్యాణ్ కెరియర్..

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత బద్రి సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక గుడుంబా శంకర్ తో వెనుతిరిగి చూడని పవన్ కళ్యాణ్.. సినిమాల పరంగా దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక రాజకీయాలలోకి వచ్చి … ప్రజలకు ప్రత్యక్షంగా మంచి చేయాలని అనుకున్నా… దాదాపు 13 సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు ప్రజలకు అన్ని విషయాలలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరి ఏ మేరకు ఈ ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలకు అండదండగా నిలుస్తారో చూడాలి. ఇక మరొకవైపు ఇలా చిన్నచిన్న కారణాలవల్ల వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు పవన్ కళ్యాణ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు