SSMB28 : పూజా ఉన్నట్టా ? లేనట్టా ?

సర్కారు వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలకు కూడా బుట్టబొమ్మ హాజరయ్యింది. అయితే సడన్ గా ఈ ప్రాజెక్ట్ నుండి పూజా తప్పుకున్నట్టు ప్రచారం మొదలైంది. ఆమె స్థానంలో గ్యాంగ్ లీడర్, శ్రీకారం వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ ను తీసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తల పై చిత్ర బృందాన్ని ప్రశ్నించగా ఆ వార్తల్లో నిజం లేదు అని తేల్చేశారు.

ఈ మధ్యనే త్రివిక్రమ్, మహేష్ లు జర్మనీ లో కలుసుకుని స్క్రిప్ట్ ను ఫైనల్ చేశారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నే ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధమని స్పస్టం చేశారు. మిగతా నటీనటుల వివరాలను కూడా వారు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో హీరోయిన్ వార్తల పై క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి. నిజానికి ఇప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ లను సెట్ చేయడం దర్శక నిర్మాతలకి కష్టం అయిపోయింది. పూజా హెగ్డే, రష్మిక తప్ప వారికి వేరే ఆప్షన్ కనిపించడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు