SSMB-29 : రాజమౌళి పక్కా ప్లాన్.. కథ అక్కడి నుంచే తీసుకున్నారా..?

SSMB -29: అటు ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ క్రేజ్ అందుకున్న రాజమౌళి.. ఇటు గుంటూరు కారం సినిమాతో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి తాజాగా SSMB -29 అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం అభిమానులే కాదు యావత్ దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు.. ఇక భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా గురించి రోజుకొక వార్త ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా షూటింగ్ ప్రారంభించడం ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పుడు రాజమౌళి.. ఆయన చిత్ర బృందం ఈ సినిమా స్క్రిప్ట్ ని కూడా లాక్ చేశారని సమాచారం. ఇక తాజాగా ఈ సినిమా కోసం బెస్ట్ లొకేషన్స్ వెతుకుతున్నారట.

SSMB -29 కోసం మహేష్ భారీ కసరత్తులు..

SSMB-29 : Rajamouli's Pakka Plan.. Did the story come from there..?
SSMB-29 : Rajamouli’s Pakka Plan.. Did the story come from there..?

అయితే గతంలో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని హింట్ ఇచ్చారు. దాంతో ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది.. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని.. మనకు ఇటీవలే వైరల్ అయిన ఫోటోలు కూడా స్పష్టం చేశాయి.. లాంగ్ హెయిర్ తో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు.. ఇదిలా ఉండగా రాజమౌళి ఆయన బృందం రెండు ఆఫ్రికన్ పుస్తకాల హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.. తాజాగా ఆ రెండు పుస్తకాల ఆధారంగానే సినిమా ఉంటుందట.. ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ అని.. ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుందనే వార్త ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది..

ఎస్ఎస్ఎంబీ – 29 కథ ఆ పుస్తకాల నుంచే..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ట్రయంఫ్ ఆఫ్ ది సన్ మరియు కింగ్ ఆఫ్ కింగ్స్ అనే రెండు సెల్లింగ్ నవలల హక్కులను కొనుగోలు చేశారట . ఈ రెండు నవలలను విల్బర్ స్మిత్ రాశారు.. ఇప్పుడు ఈ పుస్తకాలను ఆధారంగా చేసుకొని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు ప్రముఖ రచయిత విజయేంద్ర వర్మ వెల్లడించారు. మొత్తానికైతే ఈ సినిమా ఎలా ఉంటుందో అని అప్పుడే ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇకపోతే మహేష్ బాబు తన పాత్ర కోసం బాడీ డెవలప్ చేస్తుండగా.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

పాన్ వరల్డ్ గా ఆస్కార్ టార్గెట్..

ఇకపోతే రాజమౌళి ఈ సినిమాతో ఎలాగైనా సరే ఆస్కార్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాతో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తారని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే అటు మహేష్ బాబు ఈ సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. జక్కన్నతో సినిమా అంటే సంవత్సరాల తరబడి ఉంటుంది.. మరి ఈ సినిమా ఎన్ని సంవత్సరాల సమయం తీసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు