సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28 ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మహేష్బాబు 28వ చిత్రంగా ఇది సిద్ధమవ్వనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇవాళ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
భారీ కెమెరాలతో హై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్టు తెలిపింది. సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్కి సంబంధించిన కొత్త లుక్ని పోస్ట్ చేశారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- సూపర్ స్టార్ మహేష్ కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా వీరి కాంబినేషనల్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఓ పవర్ పుల్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మహేష్ సరసన పూజా హేగ్దే సందడి చేయనున్నారు. మహర్షి సినిమా తరువాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.