Star Heroine: షూటింగ్లో గాయం.. ఏకంగా రూ .5కోట్లు డిమాండ్..!

Star Heroine.. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అందులో నటీనటులు గాయపడడం సహజమే. అయితే కొంతమంది ఇప్పటికీ ఆ గాయాల నుంచి కోలుకోలేకపోతున్నారు. మరి కొంతమంది ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టంట్, రోప్, డాన్స్, యాక్షన్, ఫైర్ ఇలా ఎన్నో డేంజరస్ సెక్షన్లు షూటింగ్ సెట్లో జరుగుతూ ఉంటాయి.. కాబట్టి సినిమా సెట్ లో గాయపడే ప్రమాదం కూడా ఎక్కువే. ముఖ్యంగా సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో నటీనటులు గాయపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక తమ సినిమా షూటింగ్ సమయంలో గాయపడితే నటినటులు కొంతకాలం ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ షూటింగ్ కి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మలయాళం నటి మాత్రం సెట్ లో గాయపడినందుకు నష్టపరిహారంగా రూ .5కోట్లు కావాలి అంటూ ఏకంగా కేస్ వేసింది.

Star Heroine: Injured in the shooting.. Demand Rs 5 crore at once..!
Star Heroine: Injured in the shooting.. Demand Rs 5 crore at once..!

షూటింగ్లో గాయం.. రూ .5కోట్లు డిమాండ్..

ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ నటి శీతల్ తంబి(Sethal thambi). తాజాగా ఈమె మంజు వారియర్ (Manju warrior) పై ఫిర్యాదు చేసింది. తన గాయానికి పరిహారము కింద రూ .5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. శీతల్ తంబి ప్రస్తుతం ఫుటేజ్ (Futege)అనే మలయాళ క్రైం థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఇందులో యాక్షన్ సీన్ షూటింగ్లో శీతల్ ప్రమాదంలో గాయపడింది. షూటింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తనకు గాయాలు జరిగాయని, గాయపడిన రోజు అంబులెన్స్ సర్వీస్ కూడా ఇవ్వలేదు అంటూ శీతల్ ఆరోపణలు చేసింది. ఇక ఆ గాయం కారణంగానే తన కెరియర్ లో సమస్య ఏర్పడిందని , ఇకపై తాను నటించలేకపోవచ్చు అని, అందుకే పరిహారంగా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

మంజు వారియర్ పై కేసు ఫైల్..

ఇకపోతే ఈ ఫుటేజ్ చిత్రానికి సహ నిర్మాతగా పనిచేస్తున్న నటి మంజు వారియర్ పేరు కూడా ఈ ఫిర్యాదులో పేర్కొంది శీతల్ తంబి. అలాగే ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేసింది. ఇక ఈ విషయం తెలుసుకొని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మంజు వారియర్ మలయాళ సినిమాల్లో ప్రముఖ నటిగా వ్యవహరిస్తోంది. నటనలో జాతీయ అవార్డు కూడా అందుకుంది. 1995 నుండి మలయాళ చిత్ర పరిశ్రమలో నటిస్తున్న ఈమె మలయాళం లోనే కాకుండా తమిళ్ చిత్రంలో కూడా నటించింది.

- Advertisement -

మంజు వారియర్ చిత్రాలు..

ఇటీవల ధనుష్ నటించిన అసురన్ సినిమాలో కూడా ధనుష్ భార్యగా నటించిన మంజు వారియర్ గత ఏడాది విడుదలైన అజిత్ మూవీ తునివులో కూడా నటించింది. ప్రస్తుతం పలు తమిళ్ చిత్రాలలో నటిస్తున్న ఈమె మిస్టర్, విడుతలై పార్ట్ 2, రజనీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ చిత్రాలలో కూడా నటిస్తోంది. అంతేకాదు మోహన్ లాల్ నటిస్తున్న లూసీఫర్ 2 చిత్రంలో కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పుడు నటిగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న మంజు వారయర్ శీతాల్ కేసు వేయడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. మరి దీనిపై మంజు వారియర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు