Sunil: సునీల్ నటించిన మర్యాద కృష్ణయ్య సినిమా ఆగిపోవడానికి కారణం..?

Sunil.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్రహ్మానందం తర్వాత అంతటి కామెడీ చేసే కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో సునీల్.. గతంలో సునీల్ ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించారు. అయితే హీరోగా తన కెరీర్ ని అందాల రాముడు సినిమాతో మొదలుపెట్టి.. హీరోగా పర్వాలేదు అనిపించుకున్నారు కానీ సునీల్ ని హీరోగా స్టార్డం తీసుకువచ్చేలా చేసిన ఘనత మాత్రం డైరెక్టర్ రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా సునీల్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మర్యాద రామన్న సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఆ తర్వాత హీరోగా ఎన్నో చిత్రాలలో నటించినా.. సునీల్ పెద్దగా సక్సెస్ లను అందుకోలేకపోయారు.

హీరోగా వర్కౌట్ కాకపోవడంతో విలన్ గా ఎంట్రీ..

దీంతో హీరోగా నటించిన చిత్రాలు అన్నీ కూడా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. అదే సమయంలో వినూత్నంగా ఆలోచించి కలర్ ఫోటో అనే సినిమా ద్వారా విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు సునీల్.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఇదిలా వుండగా.. సునీల్ తన కెరియర్లో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోలేదన్నట్లుగా తెలుస్తోంది.

విడుదలకు నోచుకుని సునీల్ మర్యాద కృష్ణయ్య..

Sunil: The reason for stopping Sunil's movie Maryada Krishnaiah?
Sunil: The reason for stopping Sunil’s movie Maryada Krishnaiah?

ఆ సినిమా ఏదో కాదు మర్యాద కృష్ణయ్య.. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.. కానీ రిలీజ్ కు నోచుకోలేదట. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది VN ఆదిత్య. ఈయన గతంలో మనసంతా నువ్వే సినిమాని తెరకెక్కించారు.గడచిన రెండు సంవత్సరాల క్రితం మర్యాద కృష్ణయ్య టైటిల్ తో సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం విడుదల చేశారు. మర్యాద కృష్ణయ్య సినిమా పూర్తిగా షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయలేదట..

- Advertisement -

క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన డైరెక్టర్ విఎన్ ఆదిత్య వీటిపైన స్పందిస్తూ.. సునీల్ తో కలిసి మర్యాద కృష్ణయ్య సినిమాని చేయడం జరిగింది. అయితే అది కరోనా సమయంలో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. ముఖ్యంగా ఓకే ఇంట్లోనే దాదాపుగా 30 మంది యూనిట్ స్టాఫ్ తో బయటికి వెళ్లకుండా అన్ని అక్కడే సమకూర్చుకొని భోజనంతో సహా తినడం , పడుకోవడం, షూటింగ్ చేయడం వంటివి ఒకే రూమ్లో చేశామని తెలిపారు. అయితే కరోనా సమయంలో చాలా కష్టపడి మర్యాద కృష్ణయ్య సినిమాని తెరకెక్కించాము కానీ నిర్మాత కొన్ని చెత్త కారణాలు చెప్పేసి ఆ సినిమా తనకి నచ్చలేదని రిలీజ్ చేయలేదని తెలిపారు. అయితే సినిమా రిలీజ్ చేయనప్పుడు అన్ని డబ్బులు పెట్టి సినిమా తీయడం ఎందుకు అంటూ ప్రశ్నించారు.. కానీ కష్టపడి సినిమా తెరకెక్కించిన తర్వాత ఆ సినిమా విడుదల కాకపోతే బాధ ఉంటుంది అంటూ తెలిపారు డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య.. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఓటిటి ప్లాట్ఫారం లోనైనా ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాత మక్కువ చూపుతాడేమో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు