23న ‘స‌ర్కారు వారి పాట’ నుంచి మ్యూజిక‌ల్ ట్రీట్

స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో మంచి హిట్ అందుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఇప్పుడు స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. గీతగోవిందం ఫేమ్ డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మహేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తుంది. యాక్షన్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా వ‌స్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్, జీ. మ‌హేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ థ‌మ‌న్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన క‌ళావ‌తి, పెన్నీ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.

తాజా గా ఈ సినిమా నుంచి మ‌రో అప్ డేట్ వ‌చ్చింది. ఈ నెల 23న స‌ర్కారు వారి పాట నుంచి మ్యూజిక‌ల్ ట్రీట్ ఉంటుంద‌ని చిత్ర బృందం ఆఫీషియ‌ల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన స‌ర్కారు వారి పాట నుంచి టైటిల్ సాంగ్ ఉంటుంద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ఈ సారి స్పీక‌ర్లు పగిలిపోయాలా టైటిల్ సాంగ్ ఉంటుందంటూ క్యాప్ష‌న్ కూడా జోడించింది. ఈ సాంగ్ కు ఎస్ ఎస్ థ‌మ‌న్ అందించే.. బీజీఎం ఇప్ప‌టికే టీజ‌ర్ కోసం ఉప‌యోగించారు. కాగ ఇటీవ‌ల‌ ఎస్ ఎస్ థ‌మ‌న్ చేసిన ప్ర‌తి సినిమాలో ఓ సాంగ్ టాప్ లేచిపోయాలా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఈ టైటిల్ సాంగ్ రికార్డులు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

కాగ ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. హైద‌రాబాద్ లో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య సాగే ఓ పాట చిత్రిక‌ర‌ణ జ‌రుగుతుంది. దీన్ని పూర్తి చేసుకుని మే 12 వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు