Taapsee: నాకు నచ్చిన విధంగా ఉంటా

టాలీవుడ్ లో తాప్సీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయమైన తాప్సీ, స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. దీని తర్వాత తమిళం, మలయాళంతో పాటు హిందీలో సినిమాలు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈమె తెలుగులో చివరి సారిగా మిషన్ ఇంపాజిబుల్ అనే చిత్రంలో కనిపించింది.

ఈ భామ అందం, సినిమాలతో పాటు వివాదాలతో కూడా వార్తల్లో కనిపిస్తుంది. ఇప్పటికే ఒక సారి ఫోటో గ్రాఫర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ, తాజాగా సెలబ్రెటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ” కొందరు సెలబ్రెటీలు కెమెరా ముందు, వెనకాల బాగా నటిస్తారు. వారిలా నేను నటించలేను. నేను కెమెరా ముందు, వెనకాల ఎప్పుడైనా నిజాయితీగానే ఉంటాను. నేను ఇటీవల ఫోటో గ్రాఫర్లపై సీరియస్ అయ్యాను. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనిపై కొంత మంది సెలబ్రెటీలు విమర్శలు చేశారు. మితిమీరి కొంత మంది ట్రోల్స్ చేశారు. సమాజంలో మంచి మార్కులు కొట్టేయడానికి కొంత మంది అలాంటి వ్యాఖ్యలు చేస్తారు. నేను ఎదుటి వారి పొగడ్తల కోసం ఆరాటపడను. నాకు నచ్చిన విధంగా ఉంటాను” అంటూ సెలబ్రెటీలపై సీరియస్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు