“పెళ్లి చూపులు” సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టడమే గాకుండా, టాలీవుడ్ మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. టాలీవుడ్ లో విభిన్న సినిమాలు తీసే దర్శకుల్లో ఒకరైన తరుణ్ 2018 లో తీసిన “ఈ నగరానికి ఏమైంది” సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. టాలీవుడ్ లో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లు కొట్టిన డైరెక్టర్ ఎవ్వరూ తన మూడో సినిమాకు ఆలస్యం చెయ్యలేదు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం తన మూడో సినిమాకు ఐదేళ్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
కారణాలేంటో తెలీదు గాని, యూత్ లో మంచి క్రేజ్ డైరెక్టర్ గా సంపాదించిన తరుణ్ భాస్కర్ ఐదేళ్లుగా సినిమా తీయకపోవడంతో అతని ఫ్యాన్స్ చాలా డల్ అయ్యారు. అయితే డైరెక్టర్ గా సినిమా తియ్యకపోయినా నటుడుగా సినిమాలు చేసాడు తరుణ్ భాస్కర్. తానే హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తాను, ఇంకా ఫలకనామ దాస్, సీతారామం చిత్రాల్లో తనదైన నటనతో మెప్పిచాడు.
అయితే ఇప్పుడు తన మూడో సినిమాకు శ్రీకారం చుట్టాడు తరుణ్ భాస్కర్. అంతా కొత్త వాళ్ళతో తీస్తున్న ఆ సినిమాకు “కీడా కోలా” అనే టైటిల్ కూడా పెట్టాడు. ఇక ఈ సినిమాకి టీజర్ ని జూన్29 న విడుదల చేస్తానన్న తరుణ్ భాస్కర్, అప్పటివరకు ఈ సినిమాలో నటిస్తున్న వారెవరో రివీల్ చేస్తూ రోజుకో పోస్టర్ వదులుతామన్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాలో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తున్నారు. వీజీ సైన్మ బ్యానర్పై కె వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమాపై యూత్ లో అప్పుడే మంచి క్రేజీ బజ్ ఏర్పడింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News