Janhvi Kapoor : స్వర్గీయ నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.. ఈమె బాలీవుడ్ సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసును దోచుకుంది.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఫుల్ బిజీ అయ్యింది. ఇక తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఆ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూనే రెండు భారీ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. సౌత్లో అప్కమింగ్ సెన్సేషన్గా మారుతుంది.. అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో సినిమాలు చెయ్యడం కామన్.. అయితే పాత్రకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్లను అందరం ఎక్కిస్తున్నారు. ఎక్కువగా ఎక్స్పోజ్ చేసిన హీరోయిన్లను తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో వచ్చిన హాట్ హీరోయిన్లు కేవలం ఎక్స్పోజ్ తో ఒకటి, రెండు సినిమాలు హిట్ కొట్టారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు. అందులో పాయల్ రాజ్ పుత్ లాంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాలను చేసిన సాయి పల్లవి, సంయుక్త మీనన్, నిత్యా మీనన్ లాంటి హీరోయిన్ల సినిమాలను ఎక్కువగా చూస్తున్నారు. అందుకే వాళ్ల సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది..
ఇక జాన్వీ కపూర్ బీటౌన్ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దేవర సినిమాలో న్యాచురల్ లుక్ లో కనిపించినా కూడా అందాలను ఆరబోసినట్లు తెలుస్తుంది.. దేవర నుంచి ఇప్పటివరకు జాన్వీ కపూర్ రెండు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో అమ్మడు అందాలను ఆరబోసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో అయితే ఓకే కానీ తెలుగు సినిమాలు అంటే పాత్రకు తగ్గట్లు ప్రాధాన్యత కూడా ఉండాలని అనుకుంటారు. మరి ఈమెకు తెలుగులో కేరీర్ ఉంటుందా? లేక ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల వరకే ఉంటుందా అనేది తెలియాలంటే దేవర సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.. ఈ అమ్మడు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ట్రెండీ వేర్ లో హాట్ ఫోటోలను దిగుతూ నెట్టింట బోల్డ్ షో చేస్తుంది..