Telugu Director : త్వరలో ఇండస్ట్రీకి మరో వారసుడు.. జిరాక్స్ కాపీ అంటూ పొగడ్తలు..!

Telugu Director.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల వారసులు ఒకరి తరువాత ఒకరు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే మరికొంతమంది ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు.. ఇక ఈ నేపథ్యంలోనే మరో వారసుడు ఇండస్ట్రీకి రాబోతున్నారు.. ఆయన ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొడుకు.. తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని నిన్న దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు మీడియా ముందు కనిపించని త్రివిక్రమ్ భార్య సౌజ..న్య కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసింది త్రివిక్రమ్ ,ఆయన భార్య, ఇద్దరు కుమారుల ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అయితే ఈ విజువల్స్ లో త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి అందరి దృష్టిని ఆకర్షించారని చెప్పవచ్చు..

ఇండస్ట్రీలోకి త్రివిక్రమ్ వారసుడు..

Telugu Director : Soon another successor of the industry.. Compliments as xerox copy..!
Telugu Director : Soon another successor of the industry.. Compliments as xerox copy..!

తండ్రికి జిరాక్స్ కాపీ..చూడడానికి హీరో కట్ అవుట్.. అందుకే త్వరలోనే రిషి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని త్రివిక్రమ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఇప్పటికే త్రివిక్రమ్ కుమారుడు రిషి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయారు.

హీరోగా కాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా..

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం VD12..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ కొడుకు రిషి పనిచేస్తున్నట్లు సమాచారం.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి రిషి అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రిషి.. భవిష్యత్తులో హీరోగా ఎంట్రీ ఇస్తాడా ? లేక తండ్రిలాగే డైరెక్టర్గా సెటిల్ అవుతారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.

- Advertisement -

త్రివిక్రమ్ తదుపరి చిత్రాలు..

ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. త్రివిక్రమ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవలే మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాను తెరకేక్కించిన ఈయన ఈ సినిమాతో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ తో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు త్రివిక్రమ్.. నిజానికి పుష్ప పూర్తి కాగానే త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని అల్లు అర్జున్ ఎప్పుడో ప్రకటించారు. కానీ అనుకోకుండా పుష్ప సీక్వెల్ ను కూడా తెరకెక్కించాలని సుకుమార్ ఫిక్స్ అయ్యారు.. ఇక అందులో భాగంగానే త్రివిక్రమ్ , అల్లు అర్జున్ సినిమాకి కాస్త బ్రేకులు పడ్డాయి… ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రీకరణ పూర్తయి సినిమా రిలీజ్ అయిన వెంటనే త్రివిక్రమ్ చిత్రాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

అట్లీ కాదు త్రివిక్రమ్.. కన్ఫర్మ్ అయినట్టే..

ఇదిలా ఉండగా మరొకవైపు పుష్ప 2 తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ అట్లీ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ గీత ఆర్ట్స్ ఇవ్వకపోవడంతో అట్లీ సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక అందుకే అల్లు అర్జున్ పుష్ప 2 అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు