Darshan : దర్శన్ కి మద్దతుగా తెలుగు హీరో! ఇది ఊహించలేదు..

Darshan : కన్నడ నాట కొన్ని రోజుల నుండి సంచలనం సృష్టిస్తున్న కన్నడ స్టార్ దర్శన్ అభిమాని రేణుకా స్వామి మర్డర్ కేసు గురించి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా దర్శన్ ని తన అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణల మీద అరెస్ట్ చేశారు పోలీసులు. ఈకేసు ఇప్పటికే సౌత్ ఇండియా మొత్తం సంచలనంగా మారగా, ఈ కేసునుండి వచ్చే ఒక్కో అప్డేట్ దర్శన్ ని నిందితుడిగా చూపిస్తున్నాయి. ఇక దర్శన్ ప్రస్తుతం కేసు విచారణ లో కూడా జైలులోనే ఉన్నందున పొలిసు అధికారులు కేసుని విచారిస్తున్నారు. ఇంకా తీర్పు వెలువడలేదు. ఇక ఈ మర్డర్ కేసులో చనిపోయిన అభిమాని రేణుకాస్వామికి మద్దతుగా, వారి కుటుంబానికి అండగా అందరూ సెలెబ్రిటీలు నిలుస్తున్నారు. అయితే కన్నడ స్టార్స్ మాత్రం నిజానిజాలు తెలియకుండా దర్శన్ (Darshan) కి మద్దతుగా ఉండలేకపోతున్నారు. కనీసం దర్శన్ కుటుంబానికి అండగా ఉన్నా, నెట్టింట ప్రేక్షకులు, జనాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కిచ్చా సుదీప్ లాంటి అతి కొద్దీ మంది స్టార్లు కూడా తటస్థంగా నిలిచారు. అయితే తాజాగా ఓ తెలుగు హీరో మాత్రం ఆశ్చర్యంగా దర్శన్ కి మద్దతుగా నిలిచాడు.

Telugu hero Naga Shaurya supports Darshan in the murder case

దర్శన్ కి మద్దతుగా నాగశౌర్య…

అయితే దర్శన్ అభిమాని రేణుకాస్వామి యొక్క మరణించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ప్రతి ఒక్కరూ దర్శన్‌ ను దారుణంగా విమర్శిస్తున్నారు. అలాగే నిందితుడికి యావజ్జివ శిక్ష విధించాలని తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. దీనిపై దర్శన్ తోటి స్టార్ నటులు కూడా ఎటూ కాకుండా తటస్థంగా నిలిచారు. కానీ, అతి తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే దర్శన్‌ కు మద్దతుగా నిలుస్తున్నారు. వారిలో మొట్టమొదటిగా టాలీవుడ్ నుండి తెలుగు హీరోగా నాగశౌర్య నిలిచాడు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో దర్శన్ మర్డర్ కేసు గురించి స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చాడు.

- Advertisement -

దర్శన్ అన్న అలాంటివాడు కాడు – నాగశౌర్య..

నాగశౌర్య దర్శన్ గురించి స్పందిస్తూ… మరణించిన రేణుకస్వామి వారి కుటుంబానికి నా నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను… మరియు ఈ కష్ట సమయంలో వారికి మనోబలం చేకూరాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అయినప్పటికీ, ఈ సమస్యపై ప్రజలు సంఘీభావం చూసి చాలా నిరాశ చెందాను. కానీ దర్శన్ అన్న తన కలలో కూడా ఎవరికీ హాని కలిగించే వ్యక్తి కాదు. అతని గురించి బాగా తెలిసిన వారు అతని దాతృత్వాన్ని, మంచి స్వభావాన్ని మరియు ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న నిబద్ధతను ధృవీకరించగలరు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. ఈ భయంకరమైన భయంలో కూడా నేను ఈ వార్తను అంగీకరించలేను. మన న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, త్వరలోనే నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నాను. అలాగే మరో కుటుంబం కూడా చాలా బాధపడుతోందని గుర్తుంచుకోవాలి. ఈ సవాలు సమయంలో వారు గోప్యత మరియు గౌరవానికి అర్హులు. తన చిత్తశుద్ధి మరియు మంచితనానికి మారుపేరైన దర్శన్ అన్న నిర్దోషి అని నిరూపించబడతారని, మరియు నిజమైన నేరస్థుడిని న్యాయస్థానం ముందుకు తీసుకువస్తారని నేను గట్టిగా నమ్ముతున్నానని నాగశౌర్య ఇంస్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చాడు.

అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు నాగశౌర్యని నెట్టింట భారీగా ట్రోల్ చేస్తున్నారు. విషయం ఏంటో తెలిసి కూడా ఇలా ట్వీట్ వేస్తావా అని గట్టిగా తిడుతున్నారు కూడా. ఏది ఏమైనా నాగశౌర్య ఇంకాస్త వేరే విధంగా స్పందించాల్సి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విమర్శకులు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు