Guntur Kaaram : తమన్ సైలెన్స్… ఆ విషయంలోనే డిస్టర్బ్ అయ్యాడా?

Guntur Kaaram : ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. ఇక ఆయన మ్యూజిక్ అందించే సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లలో తమ ఎంత హుషారుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో రోజుకో అప్డేట్ షేర్ చేస్తూ హీరోల అభిమానుల్లో ఫుల్ జోష్ పెంచేస్తాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి తమన్ చాలా సైలెంట్ గా ఉంటూ వస్తున్నాడు. దానికి కారణం ఆయన ఓ విషయంలో డిస్టర్బ్ అయ్యాడని సమాచారం. ఇంతకీ తమన్ డిస్టర్బ్ కావడానికి కారణం ఎవరు? ఎవరి వల్ల డిసప్పాయింట్ అయ్యి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు? అంటే…

ప్రస్తుతం తమన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లు చాలా కాలం క్రితమే మొదలైన విషయం తెలిసిందే. “దమ్ మసాలా” సాంగ్ రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో తమన్ చేసిన సందడి అంతా కాదు.

అయితే తాజాగా “గుంటూరు కారం” మూవీ నుంచి “కుర్చీ మడత పెట్టి” అనే మాస్ బీట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రోమో సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ సాంగ్ గురించి జరుగుతున్న చర్చ చూస్తూ ఉంటే “గుంటూరు కారం” మూవీకి సగం ప్రమోషన్స్ అయిపోయినట్టే అనిపిస్తోంది. అయితే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ కు ముందు గానీ లేదా రిలీజ్ అయ్యాక గానీ తమన్ నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్ రాకపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది. అసలు తమన్ ఈ సాంగ్ గురించి ఎందుకు స్పందించలేదు అంటే?

- Advertisement -

రీసెంట్ గా “గుంటూరు కారం” నుంచి రెండవ సాంగ్ “ఓ మై బేబీ” విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాటపై ప్రేక్షకుల నుంచి తీవ్రమైన నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాట పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ తమన్, లిరికల్ రైటర్ రామజోగయ్య శాస్త్రినీ టార్గెట్ చేస్తూ, నెగిటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. వాళ్ల అసంతృప్తి చిత్ర బృందం నుంచి వచ్చిన రియాక్షన్ తో వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే తమన్ ఇంతకుముందులా అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటున్నాడని సమాచారం.

అంతేకాకుండా కొంతకాలం నుంచి “గుంటూరు కారం” మూవీకి సంబంధించిన లీక్స్ బయటకు వస్తూ ఉండడంతో తమన్ ప్రస్తుతం ఎవరినీ కలవడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది. గత 20 రోజుల నుంచి తమన్ కేవలం సినిమాకు మంచి పాటలు, బిజిఎం అందించడం పైనే సీరియస్ గా కాన్సెంట్రేట్ చేశారట. కేవలం “గుంటూరు కారం” మూవీ విషయంలోనే కాదు గతంలో తమన్ మ్యూజిక్ అందించిన “స్కంద” లాంటి సినిమాల విషయంలో సైతం ఇలాగే నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే వాటిని తమన్ పెద్దగా పట్టించుకోలేదు కానీ రీసెంట్ గా “గుంటూరు కారం” మూవీ సెకండ్ సాంగ్ విషయంలో జరిగిన వివాదంతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ డిస్టర్బ్ అయినట్టు సమాచారం. అందుకే తమన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు