Thanu Sree Datta: నేషనల్ అవార్డ్ విన్నర్‌పై లైంగిక ఆరోపణలు.. రజినీకాంత్, అక్షయ్ కుమార్ కూడా..!

Thanu Sree Datta:ఈమధ్య కాలంలో “మీటూ” ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది మహిళలు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు సంబంధించి పలు విషయాలపై స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ ను మొదలుకొని ఎస్తేర్ వరకు చాలామంది లైంగిక వేధింపులపై స్పందించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు బాలకృష్ణ హీరోయిన్ తను శ్రీ దత్త కూడా ఏకంగా నేషనల్ అవార్డు విన్నర్ పై లైంగిక ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారింది.

మీటూ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే తను శ్రీ దత్త..

Thanu Sree Datta: Sexual allegations against the National Award winner.. Rajinikanth, Akshay Kumar too..!
Thanu Sree Datta: Sexual allegations against the National Award winner.. Rajinikanth, Akshay Kumar too..!

అసలు విషయంలోకెళితే 2018లో మీటూ ఉద్యమాన్ని ఇండియాలో మొదలుపెట్టిన నటి తను శ్రీ దత్త. పదేళ్ల క్రితం ఒక సినిమా సెట్ లో ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించడం అప్పట్లో సంచలనం సృష్టించింది ..దీని తర్వాత చాలామంది నటీనటులు కూడా చిత్ర పరిశ్రమలో తమకు వేధింపులు ఎదురయ్యాయని.. ఒక్కొక్కరిగా ప్రముఖుల పేర్లు బయటపెట్టారు.. అప్పట్లో తనుశ్రీ ఆరోపణల నేపథ్యంలో నానా పటేకర్ “హౌస్ ఫుల్ 4 ” తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారు. దీంతో ముంబై పోలీసులు 2019 జూన్ లో ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఇక తాజాగా నానా పటేకర్ ఈ వేధింపుల విషయంపై మీడియాతో మాట్లాడారు.

నేషనల్ అవార్డు విన్నర్.. కానీ అమ్మాయిలతో అసభ్యకర ప్రవర్తన..

నానా పటేకర్ విషయానికి వస్తే.. హిందీ, మరాఠీ, నేపాలి, అస్సామీ, తమిళ చిత్రాలలో నటించడమే కాదు తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.. ఈయననే లైంగికంగా వేధించాడని తను శ్రీ దత్త ఆరోపించింది ..2019లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తెలిపింది.. ఈ విషయంపై తను శ్రీ దత్త మాట్లాడుతూ.. నానా పటేకర్ గొప్ప నటుడు కావచ్చు కానీ అతడు ఆడవారి పట్ల… అమర్యాదగా ప్రవర్తిస్తాడు… నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. కానీ ఎవరు మాట్లాడరు.. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు అంటూ వాపోయింది.. ఈ సందర్భంగా ఆమె అక్షయ్ కుమార్ , రజినీకాంత్ పేర్లు కూడా ప్రస్తావించింది..

- Advertisement -

అక్షయ్ కుమార్, రజినీకాంత్ కూడా..

అక్షయ్ కుమార్ కూడా 8 సంవత్సరాలుగా నానా పటేకర్ తో కొన్ని సినిమాల్లో నటించారు.. రజినీకాంత్ కూడా ఈమధ్య కాలా సినిమాలో నటించారు.. పెద్దపెద్ద స్టార్ హీరోలు అందరూ కూడా ఇలాంటి నేరస్తులతో కలిసి పనిచేస్తున్నప్పుడు .. ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చినా సరే ఫలితం ఉండదు అంటూ ఆమె బాధపడ్డారు. జనాలందరూ కూడా ఈ విషయాలపై గుసగుసలాడుతారు.. కానీ ఎవరూ ధైర్యంగా ప్రశ్నించరు. ఇక్కడ ఇంకా దారుణం ఏమిటంటే తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి మా గురించి చెడుగా మాట్లాడుతారు.. ఆమె స్క్రీన్ మీద ఎంత స్కిన్ షో చేస్తోంది.. బయట కూడా అలాగే ఉంటుంది.. కాబట్టి ఇలా జరిగింది అంటారు కానీ ఒక్కరు కూడా మేము కేవలం మా జీవనోపాధి కోసం మాత్రమే ఇలా చేస్తున్నామని ఆలోచించరు.. మాలో చాలామంది తమ సంపాదన నుంచి కొంత భాగాన్ని రైతులకు , పేదలకు ఇస్తారన్న విషయం కూడా మీకు తెలియదు.. కేవలం స్కిన్ షో గురించి మాత్రమే మాట్లాడుతారు…

వేధించడమే కాదు నా కుటుంబాన్ని రౌడీలతో బెదిరించాడు కూడా..

పటేకర్ నన్ను వేధించి, అవమానించి, బాధించి, బెదిరించడంతోపాటు మా కుటుంబ సభ్యులపై కూడా రౌడీలతో దాడి చేయించాడు.. నా సినీ జీవితాన్ని నాశనం చేశాడు.. ఇన్ని దారుణాలకు పాల్పడినా.. బాలీవుడ్ నిర్మాతలు మద్దతుగా నిలిచారు… కం బ్యాక్ కు ఘనంగా వెల్కం చెప్పారు.. నా తప్పు లేకపోయినా నన్ను ఇండస్ట్రీకి దూరం చేశారు.. సుశాంత్ కు ప్రజలు న్యాయం జరగాలని అడుగుతున్నారు.. కానీ న్యాయం జరగదు? ఈ వ్యవస్థతో పోరాడి విసిగిపోయాను.. ఇది చెడ్డ వ్యక్తులను రక్షించడమే కాకుండా మద్దతు ఇస్తూ తిరిగి అవకాశాలు ఇస్తోంది.. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఐటి శిక్షణ తీసుకుంటున్నాను అంటూ చెప్పింది తను శ్రీ దత్త.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు