tollywood : ఇప్పటికీ ఆ విషయాన్ని తలుచుకుని ఏడుస్తున్న తారక్..?

జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకు ఎంత ఇష్టమో కొత్తగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ లో సీనియర్ ఎన్టీఆర్ ని పోల్చుకుంటూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అభిమానులు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” సినిమాతో దేశంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకరిగా మారారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆయన 30 వ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే తారక్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో మరోసారి వైరల్ అవుతుంది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి అనే హీరోయిన్ తో నరసింహుడు మరియు అశోక్ అనే సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాల షూటింగ్స్ సమయంలోనే ఎన్టీఆర్ సమీరా రెడ్డితో బాగా క్లోజ్ అయ్యాడని.. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పీక్స్ కి చేరి.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే అలాంటిదేమీ లేదని తారక్ క్లారిటీ కూడా ఇచ్చారు.

అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో అరా కొరా ఈ వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే పెళ్లి అయిపోయి, ఇద్దరు పిల్లలు ఉన్న తారక్ పై ఇలాంటి వార్తలు ఎలా రాస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నందమూరి అభిమానులు. ఈ మధ్యకాలంలో కావాలనే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కడనికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ పై ఇలా చీప్ గా వార్తలు ఎందుకు రాస్తున్నారు అంటూ కొన్ని పత్రికలపై మండిపడుతున్నారు నందమూరి అభిమానులు. ఇకనైనా ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు