Kalki: దర్శకులు మధ్య ముదిరిన వివాదం , ఇంస్టాగ్రామ్ స్టోరీ డిలీట్

Kalki: రీసెంట్ టైమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అగ్ర నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం దాదాపు 700 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించారు. అయితే మైథిలాజికల్ సైన్స్ ఫిక్స్ జోనర్ లో వచ్చిన సినిమా ఇది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే 191 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ నటించారు.

ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ కల్కి సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసింది చిత్ర యూనిట్. ఆ తర్వాత నిర్మాత అశ్విని దత్ కి బాగా సన్నిహితులు అయిన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం గా చర్యలు చేపట్టిన తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మంచి టిక్కెట్ రేట్లను కూడా కేటాయించారు. ఇ తరుణంలో ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అధికారికంగా కూడా ప్రకటించారు.

Nag Aswin about Sandeep Reddy

- Advertisement -

ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేసిన సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని పెట్టారు. దానిలో ఈ 1,000 కోట్లు ఈ సినిమాకు కలెక్షన్స్ రావటం అనేది ఒక మైల్ స్టోన్. ఈ సినిమాలో రక్తపాతం బీభత్సం హింసాత్మకంగా ఏమీ లేకుండా ఈ సినిమాను తెరకెక్కించాము ఆడియన్స్ అందరూ మా వైపు నిలబడి బాగా సపోర్ట్ చేశారు అంటూ స్టోరీ పెట్టాడు. అయితే ఆ స్టోరీ సందీప్ రెడ్డి వంగాను ఉద్దేశించి పెట్టాడు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా చేశారు. ప్రస్తుతం ఆ స్టోరీ ఇప్పుడు కనిపించడం లేదు దీనికి కారణం బహుశా నాగ్ అశ్విన్ పెట్టిన స్టోరీని నెటిజన్స్ వేరేలా అర్థం చేసుకున్నారు అని అనుకోవడం వలన నాగ్ అశ్విన్ ఈ స్టోరీ ను డిలీట్ చేశాడు అని అనుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు