The Ghost : టార్గెట్ శత్రువులే

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. సినిమాలో ఘోస్ట్ లో నాగ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ది ఘోస్ట్ మూవీ ని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. పి.ఎస్.వి గరుడవేగ సినిమా తర్వాత ఆ రేంజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రవీణ్ సత్తారు, ది ఘోస్ట్ సినిమాను తెరకేక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా చిత్ర బృందం మరో ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇక టైలర్ విషయానికి వస్తే, నాగార్జున కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి దిగారు. కత్తి పట్టుకొని పీకలు కోశారు. ఎవడు వాడు అంటూ నవీన్ చంద్ర వాయిస్ తో ట్రైలర్ ను స్టార్ట్ చేశారు. నాగార్జున కత్తి పట్టుకొని నిలబడగా, అతని ముందు అందరూ మోకాళ్ళపై కూర్చున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఘోస్ట్ అంటూ వాయిస్ వినిపిస్తుంది.

డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుందంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ గా ది ఘోస్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు తెరకెక్కించినట్టు అర్థం అవుతుంది. నాగార్జున రెండు గెటప్స్ లో కనిపిస్తున్నట్లు సమాచారం. అయితే ట్రైలర్ లో ఒక గెటప్ మాత్రమే చూపించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు