Sai Dharam Tej: వినూత్న పద్ధతి లో విరూపాక్షను ప్రమోట్ చేస్తున్న మూవీ టీమ్.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటించిన చిత్రం విరూపాక్ష. కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా యొక్క ట్రైలర్ ఏప్రిల్ 11న విడుదలై మంచి వ్యూస్ తో ముందు కు వెళుతుంది. 5 మిలియన్లకు ఈ వ్యూస్ చేరువ కాగా లక్షకి పైగా లైక్స్ వచ్చాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్’ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

అయితే విరూపాక్ష ట్రైలర్ ను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు చిత్ర యూనిట్ వెరైటీ గా ప్లాన్ చేసింది. విరూపాక్ష ట్రైలర్ ను చిన్నపాటి ట్రకుల్లో స్క్రీనింగ్ రెడీ చేసి, ప్రతి ఊరులోనూ ఈ సినిమా ట్రైలర్ ను ప్లే చేస్తున్నారు. అంతే కాదు ట్రైలర్ ని చూసి ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకొని వారు సెల్ఫీ తీసుకొని ట్రైలర్ ని చూసి వారి రెస్పాన్స్ ని సినిమా టీమ్ తో షేర్ చెయ్యమన్నారు. దీని వల్ల విరూపాక్ష సినిమా పబ్లిక్ కి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఓపెనింగ్స్ కూడా బాగా రావచ్చు.

ఇక విరూపాక్షలో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సాయి చంద్, శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విరూపాక్ష సినిమా ను ఏప్రిల్ 21 న పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు