The Rajasaab : రాజాసాబ్ రేంజ్ పెరిగింది.. లెక్కలు మారుతున్నాయి?

The Rajasaab : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో ” ది రాజాసాబ్” ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రభాస్ చాలా ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చేస్తున్న పక్కా మాస్ మసాలా మూవీ కాబట్టి అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో గాని, లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజాసాబ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండియా వైడ్ గా ప్రభాస్ కల్కి సినిమా హవానే నడుస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 700 కోట్లు కొల్లగొట్టి వెయ్యికోట్ల దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా వల్ల రాజా సాబ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయని సమాచారం.

The Rajasaab movie will get huge demand

రాజాసాబ్ రేంజ్ పెరిగింది..హై డిమాండ్

ఇక వరల్డ్ వైడ్ గా కల్కి సినిమా చూపిస్తున్న ప్రభంజనం ఊపులో ప్రభాస్ రాజాసాబ్ (The Rajasaab) సినిమాకి హై డిమాండ్ ఏర్పడింది. ప్రభాస్ కల్కి తర్వాత వచ్చే సినిమా రాజాసాబ్ కావడంతో ఈ సినిమాకి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే సాలిడ్ అడ్వాన్సులు ఇచ్చేనందుకు రెడీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ కొన్ని చోట్ల నిర్మాతలకు అడాన్సులు ఇచ్చేశారని టాక్. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మినహా మరే అప్డేట్ కూడా రాని ఈ సినిమాకి కల్కి వసూళ్ల రేంజ్ వల్ల దీనికి భారీ డిమాండ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమాకు 300 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందట. ఇక షూటింగ్ పరంగా కల్కి సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తి చేసుకుంది. మొన్నటివరకు ప్రభాస్ లేని సీన్లని షూట్ చేసిన మారుతి ఇప్పుడు డార్లింగ్ రాక కోసం వెయిట్ చేస్తున్నాడు.

- Advertisement -

పక్కా ఎంటర్టైనర్ గా రాజాసాబ్..

ఇక ప్రభాస్ నుండి డార్లింగ్ తర్వాత ఆ రేంజ్ ఎంటర్టైనర్ రాలేదు. ఇప్పుడు రాజాసాబ్ ఆ లోటుని భర్తీ చేస్తుందట. ప్రభాస్ చాలా క్లాసిక్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకోసం అదిరిపోయే ట్యూన్స్ ని సిద్ధం చేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జులై మూడో వారంలో మళ్ళి స్టార్ట్ కానుంది. ఇక జులైలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు