Siddu jonnalagadda : టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ లాక్ !

టాలీవుడ్ లో ప్రస్తుతం పార్ట్2 ల ట్రెండ్ జోరుగా సాగుతున్న విషయం అందరికి తెల్సిందే. గతంలో సింగల్ సినిమాలనే దృష్టి పెట్టిన మేకర్స్ అంత, ఇప్పుడు హిట్టైన సినిమాలకి సీక్వెల్ పైన కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ విధంగా చేయడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సినిమా హిట్టవడం, జనాలకి నచ్చడం అనేది అతి పెద్ద టాస్క్ గా మారడంతో, హిట్టైన సినిమాల సీక్వెల్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది.

బాహుబలి సినిమాతో ఊపందుకున్న ఈ పార్ట్ 2 ట్రెండ్, పెద్ద సినిమాలకు మాత్రమే కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలు, మరియు చిన్న సినిమాకు విస్తరించింది. ఇలాంటి ధోరణిలో వచ్చి సూపర్ హిట్టైన సినిమానే డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కింది. విమల్ కృష్ణ అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2022 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

సినిమాలో సిద్దు జొన్నలగడ్డ టిల్లు పాత్ర ద్వారా ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. గతంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా చాలా సినిమాలే చేసిన ఆయనకి బ్రేక్ ఇచ్చింది మాత్రం డీజే టిల్లు సినిమానే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ సరసన ఈ సినిమాలో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ని వచ్చే సెప్టెంబర్ 15న లాక్ చేసారు. అయితే సెప్టెంబర్ 18న వినాయక చవితి ఉండటంతో, ఈ సెలవులని దృష్టిలో పెట్టుకొని ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశి సినిమాని నిర్మిస్తుండగా, మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు