Tollywood : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చైల్డ్ యాక్టర్..!

Tollywood .. ఇప్పటితో పోల్చుకుంటే గతంలో చైల్డ్ యాక్టర్స్ భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా , హీరోలుగా సత్తా చాటిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించిన చాలా మంది చైల్డ్ యాక్టర్స్ ఈ మధ్యకాలంలో అటు హీరోయిన్ గా ఇటు హీరో గా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగులుతున్నారు.కానీ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నా.. అందులో కొంతమంది అదృష్టం బాగుండి హీరోయిన్ గా సక్సెస్ అయితే మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారు.. ఇకపోతే గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఇప్పుడు చాలా అందంగా హీరోయిన్ లాగా కనిపిస్తుంటే.. మరికొంతమంది మాత్రం బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అలాంటి వారిలో ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ట కూడా ఒకరు.. గతంలో ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోల పక్కన చైల్డ్ యాక్టర్ గా నటించిన శ్రేష్ట గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Tollywood : A child actor who has changed beyond recognition..!
Tollywood : A child actor who has changed beyond recognition..!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్…

ముఖ్యంగా చైల్డ్ యాక్టర్ శ్రేష్ట పేరు చెప్పగానే గుర్తు పట్టకపోవచ్చు కానీ 1980-90లో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది.. సుమారుగా 100కు పైగా చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించింది. పెద్దయ్యాక హీరోయిన్ గా సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆ తర్వాత ఈమె జాడ ఎక్కడ కనిపించలేదు.. కానీ ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఈమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పైగా తాను ఎవరు అన్న విషయాన్ని తానే స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకు ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోయారు. అంతలా మారిపోయింది శ్రేష్ట.

చివరిగా నటించింది బాలయ్య మూవీలోనే..

చైల్డ్ యాక్టర్ శ్రేష్ట బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి చిత్రంలో నడవలేని చెల్లెలిగా అద్భుతమైన పాత్రలో నటించింది శ్రేష్టనే నట. అయితే చివరి సినిమా కూడా ఈ సినిమానే కావడం గమనార్హం. ఆ తర్వాత తన పూర్తి దృష్టి మొత్తం చదువుపైనే పెట్టినట్లు తెలియజేసింది. చదువు పూర్తి చేసుకుని యూఎస్ఏ లో జాబ్ కూడా చేసినట్లు వెల్లడించింది.. తిరిగి స్వదేశానికి వచ్చిన ఈమె ప్రస్తుతం తన తండ్రి వద్ద కన్స్ట్రక్షన్ లకు సంబంధించిన వ్యవహారాలను కూడా తానే దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్లు ఈ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

- Advertisement -

మంచు మనోజ్ తో పెళ్ళి..

అంతేకాదు టాలీవుడ్ లో బడా ఫ్యామిలీ గా పేరు పొందిన ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.. అలాంటి ఫ్యామిలీకి ఈమె కోడలిగా వెళ్లాలనుకుందట. మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ తో పెళ్లి జరగాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల అది ఆగిపోయింది అని కూడా తెలియజేసింది.. ప్రస్తుతానికైతే ఈమె సింగల్ గానే ఉంటున్నట్లు వెల్లడించింది.. ఏది ఏమైనా శ్రేష్ట ఒకప్పటి బాలనాటిగా అందరిని మెప్పించినప్పటికీ ఇప్పుడు చూస్తే ఆమెను గుర్తుపట్టడం చాలా కష్టం అన్నట్టుగా మారిపోయింది. అధిక బరువు ఉండడమే కాకుండా.. చాలా బొద్దుగా మారిపోయి ఉండడంతో ఈమెను గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉందంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreshta Toutam (@toutamsreshta)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు