Tollywood Director : ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం ఇంట సంతోషం వెల్లివిరిసింది. తాజాగా వారి ఇంట మహాలక్ష్మి జన్మించడంతో సంతోషంతో ఈ కుటుంబం సంబరాలు జరుపుకుంటున్నారు. ఏఎమ్ రత్నం తనయుడైన జ్యోతి కృష్ణ భార్య ఐశ్వర్య బుధవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అసలు విషయాన్ని వెల్లడిస్తూ బుజ్జి పాపాయి రాకతో తమ ఇంట సంతోషం నిండిపోయిందని చెప్పుకొచ్చారు. దీంతో ఏఎమ్ జ్యోతి కృష్ణకు పవర్ స్టార్ అభిమానులు అభినందనలు వర్షం కురిపిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత తనయుడుగా ఎంట్రీ..
టాలీవుడ్ లోని బడా నిర్మాతల్లో ఏఎం రత్నం కూడా ఒకరు. ఆయనకు జ్యోతి కృష్ణ, రవికృష్ణ ఇద్దరు కుమారులు. 7/G బృందావన కాలనీ సినిమాలో హీరోగా చేసిన రవికృష్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇక జ్యోతి కృష్ణ నటుడిగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకునే పనిలో పడ్డారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి ఏఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
ఇదిలా ఉండగా 2012లో జ్యోతి కృష్ణ, ఐశ్వర్య వివాహం వైభవంగా జరిగింది. ఐశ్వర్య స్వస్థలం హైదరాబాద్. పైగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమాతో ఆమె నిర్మాతగా, ప్లే బ్యాక్ సింగర్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
హరి హర వీరమల్లు పైనే ఆశలన్నీ…
ఏఎమ్ జ్యోతికృష్ణ ఇప్పటికే ఆక్సిజన్, కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ సినిమాలను డైరెక్ట్ చేసి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన తండ్రి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం చేయబోతున్నారు. రీసెంట్గగా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను ముందుగా క్రిష్ డైరెక్టర్ గా ప్రకటించారు మేకర్స్. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ మూవీ దర్శకత్వం బాధ్యతలు జ్యోతి కృష్ణ చేతుల్లోకి వచ్చి పడ్డాయి.
ఇక రీసెంట్ గా ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోన తాను తిరిగి సినిమా షూటింగ్ లు స్టార్ట్ చేయడానికి మూడు నెలల సమయం పడుతుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియల్, నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఒక గుడ్ న్యూస్ అయితే, అంతలోనే తన ఇంట మహాలక్ష్మి కాలు పెట్టడం మరో శుభవర్తగా మారింది ఏఎమ్ జ్యోతికృష్ణ ఇంట.