Tollywood Director : బిగ్ బ్రేకింగ్.. ఓయో రూమ్ లో సూసైడ్ చేసుకున్న తెలుగు డైరెక్టర్..

Tollywood Director : ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. తాజాగా మరో తెలుగు దర్శకుడు కొమరి జానయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తెలుస్తుంది. కూకట్‌పల్లి లోని భాగ్య నగర్ కాలనీలో ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని మరణించారు.. ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది..

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన డైరెక్టర్ చనిపోవడం పై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక సినిమా డైరెక్టర్ అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడమేంటి? ఏవైనా ఆర్ధిక కారణాల? లేక కుటుంబ సమస్యలా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక డైరెక్టర్ ఇలా హోటల్లో చనిపోవడం పట్ల సినిమా ఇండస్ట్రీలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి..

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొమరి జానయ్య పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. గాడ్ సైతాన్ టెక్నాలజీ వంటి పలు సినిమాలకి డైరెక్టర్ గా పని చేశాడు. సినిమాలకు ఎందుకు దూరం అయ్యాడో తెలియదు కానీ ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఆర్థిక ఇబ్బందులే అని తెలుస్తుంది.. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నాయని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు