Ramoji Rao: రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం

Tollywood: టాలీవుడ్‌ కలకలం చోటు చేసుకుంది. మన టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. రామోజీరావు మృతికి టాలీవుడ్‌ నివాళి అర్పిస్తూ.. రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు ఫిల్మ్‌ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్. ఆయన మాట్లాడుతూ… రామోజీరావు కు సంతాపంగా షూటింగ్ లకు సెలవు ఇస్తున్నట్లు వెల్లడించారు.

Ramoji Rao, chairman of 'Enadu' organizations, passed away
Tollywood has been decided to stop the shooting of the movie tomorrow

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) మరణించడం చాలా బాధకరం అన్నారు. సినిమా రంగంలో, అలాగే, మీడియా, వ్యాపారాల్లో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఆరితేరారని.. అలాంటి వ్యక్తి మరణించడం బాధ కలిగిస్తోందని చెప్పారు. ఇది ఇలా ఉండగా… రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం అయ్యారు.

ఇవాళ తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచారు రామోజీరావు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీరావు. అయితే.. నిన్న రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ తరుణంలోనే.. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణించారు. కాగా ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు