Tollywood Producer : డిప్యూటీ సీఎం ను కలిసిన నిర్మాతలు .. వీటిపైనే చర్చ ?

Tollywood Producer : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో తెలుగు సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు.. ఏపీ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముఖ్య  సమావేశానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్​తో పాటు అశ్వినీదత్, చినబాబు, నవీన్ రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్యలు తదితరులు కలిశారు..

గత ప్రభుత్వంలో తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నిర్మాతలతో పవన్ మీటింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుందని టాక్. ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలించడం గురించి కూడా ప్రధానంగా చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

Tollywood famous producers met Deputy CM Pawan Kalyan
Tollywood famous producers met Deputy CM Pawan Kalyan

జగన్ ప్రభుత్వ హయాంలో రాడిసన్‌ బ్లూ, బే పార్కులో వాటాలను పెద్దలు కొందరు దొంగలు కాజేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. అంతేకాదు వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ పైన కూడా కొందరి బడా నాయకుల కన్ను పడిందని ఆయన విమర్శించారు.. సినిమా పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు అజమాయిషీలుగా ఉన్నారని గంటా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. దీనిపై కూడా పవన్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ భేటీలో ప్రధానంగా ఎటువంటి అంశాలపై చర్చలు జరుపుతారో మరి కాసేపట్లో తెలియనుంది..

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు