Tollywood Star Hero’s: టాలీవుడ్ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ కెమెరామెన్..!

Tollywood Star Hero’s..ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత మన తెలుగు హీరోలు కూడా బాలీవుడ్ లో భారీగా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ , ఎన్టీఆర్ ఇలా చాలామంది హీరోలు బాలీవుడ్ లో కూడా బాగా క్లిక్ అవుతున్నారు.. ముఖ్యంగా వీళ్ళ సినిమాలు హిందీలో కూడా డబ్బింగ్ అయ్యి నార్త్ ని ఊపేస్తున్నాయి. అంతేకాదు ఇందుకు నిదర్శనం మన హీరోల సినిమాలకు అక్కడ పలికే హిందీ డబ్బింగ్ రేట్లే అని చెప్పవచ్చు.. అయితే ఇదే సమయంలో హిందీ హీరోల సినిమాలను మన వాళ్ళు పెద్దగా ఆదరించడం లేదు. ఇక్కడ వాళ్ళ సినిమాలు డబ్ చేసే వాళ్లే లేరు.. చేసి వదిలితే చూసే వాళ్ళు కూడా కరువు అవుతున్నారు.. ఈ క్రమంలోనే ఇన్ డైరెక్ట్ గా బాలీవుడ్ కి , సౌత్ కి మధ్య వార్ మొదలయ్యింది.. అయితే దీనిని పోటీ అనకపోవచ్చు కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మాత్రం ఇది అనక తప్పదు.

టాలీవుడ్ హీరోలపై అక్కసు కక్కిన బాలీవుడ్..

Tollywood Star Hero's: Bollywood cameramen made sensational comments on Tollywood star heroes..!
Tollywood Star Hero’s: Bollywood cameramen made sensational comments on Tollywood star heroes..!

ఇకపోతే పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత దేశం మొత్తం ఇప్పుడు సౌత్ కంటెంట్, టెక్నీషియన్స్ ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.. ఇదే సమయంలో సౌత్ హీరోలు కూడా బాలీవుడ్ లో పాగా వేసేస్తున్నారు. ఇక ఈ విషయం బాలీవుడ్ జనాలకు నచ్చడం లేదు.. ఇన్నాళ్లు గుసగుసలుగా విమర్శలు చేసే బాలీవుడ్ జనం ఇప్పుడు డైరెక్ట్ గా మన హీరోలని తిట్టిపోస్తున్నారు. పైగా ఇందుకు బాలీవుడ్ మీడియా కూడా ప్రయారిటీ ఇస్తోంది. మన సౌత్ వాళ్ళు లేకుండా ఇప్పుడు బాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ అందుకునే పరిస్థితి కూడా పెద్దగా కనిపించడం లేదు.. కేజిఎఫ్,బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా బాలీవుడ్ లో బాగా ఆడాయి. ఇక కాంతారా వంటి ప్రాంతీయ సినిమాలకు కూడా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో…అవకాశం దొరికితే చాలు నార్త్ ఇండియాలో అక్కసు ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ లిస్టులో బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలే కాదు ఇప్పుడు ఒక కెమెరామెన్ కూడా ఆ లిస్టులోకి వచ్చి చేరిపోయారు.

విజయ్ దేవరకొండ అంటేనే ఫేక్..

సౌత్ హీరోలకు ఆటిట్యూడ్ అని.. తన నోటి దురుసుతో చెలరేగిపోయాడు. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వీరేందర్ చావ్లా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సౌత్ సెలబ్రిటీలు చాలా ఫేక్ గా కనిపిస్తారు.. ఏదో పైకి మాత్రం ఒదిగి ఉన్నట్టు నటిస్తారు.. ముఖ్యంగా ఒక హీరో ( విజయ్ దేవరకొండ ) అయితే తన సినిమా ప్రమోషన్స్ కి చెప్పులు వేసుకొని వచ్చాడు.. సింపుల్గా ఉన్నట్లు కెమెరా ముందు చూపించుకోవడానికి నటించాడు అంటూ విజయ్ దేవరకొండ పై విమర్శించాడు.

- Advertisement -

ఎన్టీఆర్ కి కోపం ఎక్కువ..

అలాగే ఎన్టీఆర్ రీసెంట్గా వార్ -2 సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను విమర్శిస్తూ సౌత్ లో మరో బిగ్ స్టార్ (జూనియర్ ఎన్టీఆర్ )సాధారణంగా ఎప్పుడు సైలెంట్ గానే ఉంటాడు.. అతడు హోటల్ కి వెళ్తుండగా ఒక ఫోటోగ్రాఫర్ ఆయనను క్లిక్ మనిపించాడు.. అందుకని నా టీం మెంబెర్ పై కోప్పడ్డాడు.. నిజానికి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది వేరే వ్యక్తి.. కానీ మా వాళ్లపైన కోపడ్డాడు అంటూ విమర్శించాడు.

మహేష్ బాబు కి ఆటిట్యూడ్ ఎక్కువ..

ఇక మహేష్ బాబును కూడా ఈయన వదలలేదు.. మహేష్ బాబును కూడా విమర్శించాడు.. మహేష్ బాబు అయితే బాలీవుడ్ తనకు అవసరం లేదని చెప్పాడు. ఈయన ఇలా ఆటిట్యూడ్ చూపిస్తున్నారు ఏంటని అనుకున్నాను.. అసలు ఫేక్ గా ఉండేది సౌత్ హీరోలే.. బాలీవుడ్ లో ఉన్న వాళ్ళందరూ లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండరు.. ఎప్పటికీ ఒకేలాగే ఉంటారు అంటూ బాలీవుడ్ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ సౌత్ హీరోలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం వీరేందర్ చావ్లా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు