Tollywood: ఆ హీరోతో ప్రేమలో పడి కెరీర్నే నాశనం చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ..!

Tollywood.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఫేడౌట్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నిఖిత తుక్రాల్ కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నితిన్, నాగార్జున, శ్రీకాంత్, జగపతిబాబు తదితర హీరోలతో పలు సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ కారణంగానే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం జరిగిందట.

Tollywood: Tollywood beauty who ruined her career by falling in love with that hero..!
Tollywood: Tollywood beauty who ruined her career by falling in love with that hero..!

కన్నడ హీరో దర్శన్ కారణంగా జీవితాన్ని నాశనం చేసుకున్న నిఖిత..

దాదాపుగా నిఖిత తుక్రాల్ నటించక ఇప్పటికి సుమారుగా ఆరేళ్లపైన కావస్తోందట. ఈ ముద్దుగుమ్మ కెరియర్ నాశనం కావడానికి కన్నడ హీరో దర్శన్ కారణమట. ఈ ముద్దుగుమ్మ అప్పట్లో ఈ హీరోతో ప్రేమలో పడి తన కెరీర్నే నాశనం చేసుకుంది. అప్పటికే ఈ హీరోకి వివాహమై..భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. దర్శన్ భార్య విజయలక్ష్మి జోక్యం చేసుకోవడంతో వీరి ప్రేమ విఫలమయిందని కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.

కన్నడ అమ్మాయి కానీ తెలుగులో అవకాశాలు ఎక్కువ..

నిజానికి నిఖిత తుక్రాల్ కన్నడ ప్రాంతానికి చెందిన నటి అయినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ కారణం వల్లే ఈమెకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వెలువడ్డాయి. కళ్యాణ రాముడు, ఖుషీఖుషీగా, సంబరం, భద్రాద్రి రాముడు, అవును-2 తదితర చిత్రాలలో నటించడం జరిగింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో నెమ్మదిగా మలయాళ , తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది నిఖిత తుక్రాల్. కానీ దర్శన్ ప్రేమ వ్యవహారంతో ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయట.

- Advertisement -

ఇండస్ట్రీకి దూరమైన నిఖిత..

దీంతో ఇండస్ట్రీకి దూరమైన నిఖిత తుక్రాల్ ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుపొందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నది.. వీరిద్దరికి కూడా ఒక పాప జన్మించింది. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా నిఖిత తుక్రాల్ షేర్ చేసిన ఫోటోను చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అంటూ అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

దర్శన్ విషయానికి వస్తే..

కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన జైలులో కూడా ఉన్నారు.. పవిత్ర గౌడ అనే నటితో రిలేషన్ లో ఉండడం… ఆమె తమ రిలేషన్కు పదేళ్లు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన రేణుక స్వామి పవిత్ర గౌడ్ ను విమర్శించడం అన్ని అలా జరిగిపోయాయి.. ఇక వాటిని తట్టుకోలేక పవిత్ర గౌడ దర్శన్ తో అతడిని హత్య చేయించింది. ఇక ప్రస్తుతం A1గా పవిత్ర గౌడ , A2 గా దర్శన్ అరెస్ట్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Nikita Thukral (@nikkithukral)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు