Tollywood: టాలీవుడ్ నే షేక్ చేసేలా వారసుల ఎంట్రీ..?

Tollywood.. సినీ ఇండస్ట్రీలో సాధారణంగా చాలామంది వారసులు అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. మరి కొంతమంది ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలమంది వారసులు ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.. ఇప్పుడు ఇలాంటి సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉండడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.. పైగా వారసుల వారసులు ఇండస్ట్రీలోకి రాబోతుండడంతో అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇక అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు అడుగు పెట్టి నేడు గ్లోబల్ స్థాయిలో పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా.. ఇప్పుడు త్వరలోనే ఈయన వారసుడు గౌతమ్ కృష్ణ ఘట్టమనేని కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని సమాచారం.

మల్టీ స్టారర్ మూవీలో అకీరా – గౌతమ్:

Tollywood: Varasulu entry to shake up Tollywood?
Tollywood: Varasulu entry to shake up Tollywood?

ఇంకొకరు అకీరా నందన్ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేయకపోయినా.. ఆ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారు.. ఇప్పుడు రాజకీయాలలో దాదాపు 13 సంవత్సరాల నిర్విరామ కష్టం తర్వాత ఏకంగా ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఈయన వారసుడిగా అకీరా నందన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.. ఈ క్రమంలోనే ఇద్దరు క్రేజీ హీరోల వారసులు అరంగేట్రం పై జరుగుతున్న ప్రచారం ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఇద్దరు ఒకేసారి అందులోనూ ఒకే సినిమా ద్వారా తెరంగేట్రం చేయబోతున్నారని.. టాలీవుడ్ లోనే టాప్ హీరోలైన తమ తండ్రులను మించిన సక్సెస్ అందుకునేందుకు తొలి ప్రయత్నం లోనే మల్టీస్టారర్ మూవీని ఎంచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కథ కూడా సిద్ధం..

ఇప్పటికే కథ సిద్ధం అయిందని.. త్వరలోనే సెట్స్ పైకి రాబోతోందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాదు అదొక రికార్డు కూడా క్రియేట్ చేస్తుందని.. అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మరోవైపు మహేష్ బాబు , ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సినిమాల్లో బిజీగానే ఉన్నారు అయితే వీరు కూడా తమ వారసులను పరిచయం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారట.. నిజానికి సినీ రంగానికి చెందిన ఏ ఇద్దరు ప్రముఖులు కలుసుకున్నా.. ఆ ఇద్దరు పిల్లల ఎంట్రీ పైనే అందరూ చర్చించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఇద్దరినీ ఒకే మూవీలో పరిచయం చేస్తారనే వార్త ఇప్పుడు అభిమానులలో హైప్ పెంచుతోంది.. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసి నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.. అలాగే తన గ్రాడ్యుయేట్ ఫంక్షన్ లో తన సంగీత ప్రతిభను కూడా కనబరిచారు.. ఇక మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కూడా యాక్టింగ్ స్కిల్స్ పై శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల రోమియో జూలియట్ నాటకం వేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

తండ్రులిద్దరూ ఆసక్తి..

పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల అకీరా సినిమాపై ఇన్నాళ్లు మందడుగు పడలేదని.. ఇక ఏపీ ఎన్నికలు కూడా పూర్తవడంతో సినిమాపై చర్చలు మొదలయ్యాయని సమాచారం. ఇప్పుడు ఇద్దరూ కూడా మల్టీ స్టారర్ చిత్రం చేస్తే.. తెలుగు సినిమా మరో రేంజ్ కి వెళ్తుందని చెబుతున్నారు సినీ ప్రియులు.. ఇప్పటికే మన తెలుగు సినిమా.. దర్శకుల పుణ్యమా అని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇక మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ ,పవన్ కొడుకు అకీరానందన్ మల్టీస్టారర్ గానే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారట.. ఇక షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది అని సమాచారం. ఏది ఏమైనా అకీరానందన్ గౌతం కృష్ణ ఎంట్రీ కి అంత సిద్ధం అయినట్లే అని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు