Tripti dimri: త్రిప్తి డిమ్రి ‘బ్యాడ్ న్యూస్’ ఏంటో తెలుసా.?

Tripti dimri: తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకొని బాలీవుడ్ లో కూడా తన ప్రతిభను చూపించాడు. అయితే బాలీవుడ్లో సందీప్ రెడ్డివంగా మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా గురించి చాలా మంది నెగిటివ్గా రాశారు. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కబీర్ సింగ్ సినిమాకి దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అయితే చాలామంది రివ్యూ రైటర్లకు క్రిటిక్స్ కు సందీప్ రెడ్డి వంగ అప్పట్లోనే ఒక మాస్ వార్నింగ్ ఇచ్చాడు. నా సినిమాను చాలామంది వైలెంట్ ఫిలిం అన్నారు అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

రన్బీర్ కపూర్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా అనిమల్ అనే సినిమాను తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాపై కూడా చాలామంది విమర్శలు చేశారు. కానీ వాటన్నిటిని ఈ సినిమా కలెక్షన్స్ రాంగ్ అని ప్రూవ్ చేశాయి. ఇకపోతే ఈ సినిమాలు త్రిప్తి ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో జోయ అనే పాత్రలో కనిపించింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర ఎంతగానో గుర్తుండిపోయింది. ఎందుకంటే సినిమాలో అంత కీలకమైన సన్నివేశాలు ఆ పాత్రతో ముడిపడి ఉంటాయి.

Triptii Dimri

- Advertisement -

ప్రస్తుతం త్రిప్తి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ న్యూస్’ ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్, అమీ విర్క్, నేహా దుపియాలు కూడా ముఖ్య పాత్ర‌ల్లో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా ప్రమోష‌న్స్ ను చిత్ర యూనిట్ ఇప్ప‌టికే స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే త్రిప్తి ‘బ్యాడ్ న్యూస్’ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ సినిమాను జూలై 19న రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే ‘గుడ్ న్యూస్’ అనే సినిమాను నిర్మించిన నిర్మాత‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు