Trisha : ఆ స్టార్ తో ఫుల్ లెన్త్ రోల్ చేయాలని ఉంది

ప్రముఖ కోలీవుడ్ నటి త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా తన హవా కొనసాగిస్తూనే ఉందంటే ఆమెకు అభిమానులు ఏ రేంజ్ లో నిరాజనం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో త్రిశ తన జోరును కొనసాగిస్తోంది. యువ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమా తరువాత త్రిషకి పెద్ద స్టార్ల ఆఫర్స్ మళ్లీ మొదలయ్యాయి.

విజయ్ 67 వ చిత్రం, అజిత్ 62 వ చిత్రంలో త్రిష నటిస్తోంది. అలాగే తెలుగులో బాలకృష్ణ – అనిల్ రావిపూడి చిత్రం కోసం త్రిషని సంప్రదించారనే న్యూస్ కూడా ఉంది. అలాగే కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో త్రిషను ఫైనల్ చేసినట్టు టాక్. ఇక త్రిష తమిళంలో తాజాగా నటించిన చిత్రం రాంగి. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడుతున్నాయి.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పొన్నియన్ సెల్వన్ చిత్రంలో తనకి అవకాశం ఇచ్చిన మణిరత్నం కు ధన్యవాదాలు తెలిపింది. ఈ చిత్రంలోని కుందవై పాత్రకు తాను సరిపోతానా అనే సందేహం చాలా మందికి ఉండేదని.. అలాంటిది ఇప్పుడు తానే కుందవై అన్నంతగా ప్రేక్షకులు తనను భావించడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పింది.

- Advertisement -

అయితే ఇప్పటివరకు లోక నాయకుడు కమల్ హాసన్ నుంచి అజిత్, విజయ్, విక్రమ్, చిరంజీవి, బాలకృష్ణ, సూర్య, శింబు, ధనుష్ ఇలా అందరూ స్టార్ హీరోలతో జత కట్టిన త్రిషకి సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఫుల్ లెన్త్ రోల్ చేయాలని తన కోరిక అంటూ.. సూపర్ స్టార్ తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తన మనసులోని మాటను బయటపెట్టింది. మరి త్రిషకి తలైవాతో జతకట్టే అదృష్టం ఉందో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు