Trivikram Srinivas: కాలినడకన తిరుపతి మెట్లు ఎక్కిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కోసమే ఇంత డెడికేషన్ ఆ.?

Trivikram Srinivas: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇద్దరు మిడ్ రేంజ్ హీరోలును మినహాయిస్తే త్రివిక్రమ్ చేసిన సినిమాలు అన్నీ కూడా కేవలం స్టార్ హీరోలతోనే. స్టార్ హీరోలతో రిపీటెడ్ గా వర్క్ చేశాడు త్రివిక్రమ్. స్వయంవరం సినిమాతో డైలాగ్ రైటర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని, కొంతమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. పోస్టర్ పైన త్రివిక్రమ్ పేరు చూసి సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ కూడా ఉండేవారు.

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మధ్య ఉన్న స్నేహాను బంధం చాలా సార్లు బయటపడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత అనే సినిమాకి సహాయ రచయితగా పోసాని కృష్ణ మురళి దగ్గర పనిచేశాడు త్రివిక్రమ్. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ కొద్దిపాటి పరిచయం త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉంది. అయితే వీరిద్దరూ కలిసి జల్సా అనే సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఆల్ టైం ఇండస్ట్రీస్ రికార్డ్ గా నిలిచింది.

Pawan Kalyan

- Advertisement -

ఇకపోతే 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే 2024 కి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకునే స్థాయి వరకు ఎదిగారు. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా పవన్ కళ్యాణ్ వెనుక సపోర్ట్ గా నిలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. రీసెంట్ గా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే కాలినడకన తిరుపతి మెట్లు ఎక్కారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడకన మెట్లు ఎక్కారు. అయితే దీనిని బట్టి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇలా కాలినడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు