Ujjain Temple : మహా శివుడి పాదాల చెంత రాశి ఖన్నా… బాలీవుడ్ స్టార్ హిరోయిన్ తో కలిసి స్పెషల్ పూజలు

Ujjain Temple : ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తాజాగా మహా శివుని పాదాల చెంత భక్తితో దర్శనం ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. ఇక ఆమెతో పాటే అక్కడ మరో బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ లు ఇద్దరకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భస్మ ఆరతిలో రాశి ఖన్నా..

తాజాగా రాశి ఖన్నా, బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇద్దరూ కలిసి శివుడి మంత్రాలు పటిస్తూ ఉజ్జయిని మహాకాళేశ్వరం టెంపుల్ లో కనిపించారు. ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఉదయాన్నే మూడు గంటలకు భస్మ ఆరతి కోసం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్లు కాబట్టి స్పెషల్ గా వివిఐపీ దర్శనాలు కాకుండా సాధారణ భక్తులు మాదిరిగానే దర్శనం చేసుకున్నట్టుగా ఆ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.

ప్రత్యేక పూజలు

ఈ భస్మ ఆరతి కంప్లీట్ అయ్యాక రాశి ఖన్నాతో పాటు వాణి కపూర్ కూడా గర్భగుడిలో ఉన్న మహాకాళేశ్వరుడి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు వీరిద్దరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి, హీరోయిన్లకు ఆశీర్వచనాలు అందించారు.

- Advertisement -

Ujjain Temple: మహా శివుడి భస్మహారతిలో హీరోయిన్స్.. - NTV Telugu

ఉజ్జయినినీ సందర్శించే సెలబ్రిటీలు…

ఇక భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే ఉజ్జయిని మహాకాళేశ్వరంలోని ఆలయానికి ప్రతిరోజూ పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో పాటు సినీ స్టార్స్ కూడా వస్తుంటారు. ఈ మధ్యకాలంలోనే ఎంతో మంది బాలీవుడ్ సినీ ప్రముఖులు ఉజ్జయినిలో ఉన్న మహా శివుని దర్శించుకున్నారు. అందులో హేమమాలిని, గోవిందా, మనోజ్ బాజ్ పేయి, పరిణీతి చోప్రా రవీనా టాండన్, సింగర్ జుబిన్ నౌటీయల్, ఉమేష్ యాదవ్, సింగర్ షహనాజ్ అక్తర్, పాపులర్ సింగర్ హంసరాజ్ రఘు వంశీ, కమెడియన్ భారతి, విరాట్ కోహ్లీ దంపతులు, సునీల్ శెట్టి తదితరులు ఉన్నారు. వీళ్ళంతా తరచుగా ఇక్కడున్న మహకేశ్వరుడిని చూడడానికి వస్తూ ఉంటారు.

బాక్ తో బ్లాక్ బస్టర్ హిట్

కాగా తాజాగా తమన్నాతో కలిసి రాశి ఖన్నా బాక్ అనే హారర్ మూవీలో నటించింది. ఈ మూవీకి సుందర్ సి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రను పోషించారు. ఒరిస్సా దెయ్యం అంటూ ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిత్రబృందం. ఈ మూవీ తమిళంలో ఏకంగా 100 కోట్లు రాబట్టి, కోలీవుడ్ లో ఈ ఏడాది 100 కోటళ్ళు కొల్లగొట్టిన ఫస్ట్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. కానీ ఈ మూవీ తెలుగులో ఆడలేదు. బాక్ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలోనే రాశి ఖన్నా ఉజ్జయినిలో ఉన్న మహా శివుడిని దర్శించుకుంది.

ఉజ్జయినిలో భక్తుల తాకిడి…

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి ఇటీవల కాలంలో భక్తుల తాడికి ఎక్కువైందనే చెప్పాలి. అక్కడ మహాకాళి మహాలోక్ ను నిర్మించినప్పటి నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో పెరిగారు. శ్రీ మహాకాళేశ్వర ఆలయ నిర్వహణ కమిటీ అందించిన సమాచారం ప్రకారం ప్రతిరోజు ఈ ఆలయానికి 1.5 లక్షల నుండి 2 లక్షల మంది భక్తులు వస్తుంటారని తెలుస్తోంది. ఇక ప్రత్యేక పండగ రోజులు, సెలవు దినాల్లో అయితే భక్తుల సంఖ్యను లెక్కపెట్టడం కష్టమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు