Upasana Konidela : పవన్ ని విష్ చేస్తూ గర్వంగా మెగాకోడలు ట్వీట్…

Upasana Konidela : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మెగాభిమానులంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. కొన్నాళ్లుగా సరైన సినిమాలు రాకపోయినా, మెగా ఫ్యామిలీ లో పలు శుభ పరిణామాలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే మెగా ఫ్యామిలీ లో క్లింకార పుట్టిన తర్వాత వాళ్ళకి అన్నీ కలిసొస్తున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈరోజు (జూన్ 12) ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్బంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ప్రమాణస్వీకార వేడుకకి హాజరవడం జరిగింది. ఇక పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. స్పెషల్ గా మెగా పార్టీ నిర్వహించి తన తమ్ముడిని ఆశీర్వదించి, గుండెలకు హత్తుకోవడం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కూడా నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.

Upasana Konidela tweeted wishing Pawan Kalyan

డిప్యూటీ సీఎం గా పవన్.. మెగా ఎమోషనల్…

ఇక ఈ వేదికలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఇదే వేదికపై జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం చిరంజీవి పాదాలకు పవన్ కళ్యాణ్ నమస్కారం చేశారు. తన తమ్ముడి విజయోత్సవాన్ని చూసి చిరు ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక మోడీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లి, ఆయన మెగా బ్రదర్స్ ను దగ్గరకు తీసుకుని ప్రజలకు అభివాదం చేయించడంతో పాటు, ఇద్దరిని కౌగిలించుకున్నారు. మోది ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ ను చూస్తూ ఎంతో సంతోషపడ్డారు. ఈ క్రమంలో పవన్ గడ్డాన్ని పట్టుకొని మోడీ ముందు తన తమ్ముడిని ప్రేమగా చూస్తూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ అరుదైన సన్నివేశాన్ని చూశాక అక్కడే ఉన్న రామ్ చరణ్ కూడా ఎమోషనల్ అయ్యారు.

- Advertisement -

https://x.com/upasanakonidela/status/1800907135565344964

పవన్ పై ఉపాసన కొణిదెల పోస్ట్..

ఇక పవన్ కళ్యాణ్ గెలుపుని ప్రశంసిస్తూ, మెగా కోడలు ఉపాసన కొణిదెల (Upasana Konidela) తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ క్లింకార తో ఉన్నప్పటి ఫోటోని షేర్ చేస్తూ, ఇలా కామెంట్ పెట్టింది. “మా కంట్రీ మెన్ గురించి నేను చాలా గర్వపడుతున్నాను! తమ ఫ్యామిలీ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం అన్నింటికంటే ప్రాధాన్యత అని వారు నిరూపించారు. ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుందని నేను నమ్ముతున్నాను. మన దేశంలో గణనీయమైన మార్పుకు నాయకత్వం వహించినందుకు అభినందనలు చెప్తూ, జై హింద్ అంటూ కామెంట్ చేసింది. అలాగే మరో పోస్ట్ చేస్తూ షేర్ చేస్తూ, వేదిక పై మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయి కలుపుతూ నరేంద్ర మోదీ ప్రజలకు అభివాదం చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ విష్ చేసింది. అలాగే అందులో పవన్ బాబాయికి అభినందనలు అంటూ, జనసేనపార్టీని ప్రజలు సరిగ్గా ఎన్నుకున్నారు. జై హింద్ అంటూ పోస్ట్ చేసింది.
ఇక ఈ పోస్ట్ ని మెగాభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఉపాసన షేర్ చేసిన పోస్ట్ లో మెగా అన్నదమ్ముల ఇద్దరి అనుబంధాన్ని చూసి మెగా అభిమానులు కూడా ఎమోషనల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు