Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ని ఫాలో అవుతూ సరికొత్తగా దుస్తులు ధరిస్తూ ఉంటుంది. ఊర్వసి అంటేనే ఫ్యాషన్ కు పెట్టింది పేరుగా మారిపోయింది. మొదట మోడలింగ్ లో తన కెరియర్ ప్రారంభించిన ఊర్వశి సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లోనే (Bollywood) కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సినిమాల్లో నటించింది. ఏజెంట్, వాల్తేరు వీరయ్య, స్కంద, బ్రో వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించింది.
ఇక టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ఎన్బికె 109లో కూడా ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఊర్వశికి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయట. ఈ బ్యూటీ మరోసారి బాబీ డైరెక్షన్ లోనే నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ ప్రజల మనిషి అనే టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ఓకే చేసినట్లు ఇప్పటికే అప్డేట్లు వచ్చాయి. ఈ హై వోల్టేజ్ ఎంటర్టైనర్ లో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట.
ఇందులో ఊర్వశి (Urvashi Rautela) వన్ ఆఫ్ ది ఫిమేల్ లీడ్ రోల్ లో నటించబోతుంది టాక్. ఊర్వశితో (Urvashi Rautela) పాటు డింపుల్ హయాతి కూడా హీరోయిన్గా చేయనుంది. లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించనున్న ఈ సినిమా 2024 చివర్లో తెరపైకి రానుంది. ఇదిలా ఉండగా…. తాజాగా ఊర్వశికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఊర్వశి షూటింగ్ చేసే సమయంలో తన చేతికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరిందట. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుందట. అయితే దీనిపై ఉమైర్ సందు (Umair sandhu) సంచలన పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఊర్వశి. బాలీవుడ్ నటి ఊర్వశి ప్రెగ్నెంట్ అయిందని ….అబార్షన్ చేయించుకోవడానికి ఆసుపత్రిలో చేరిందని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తపై పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.