Varalakshmi marriage photo’s.. ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఎట్టకేలకు.. తాను ప్రేమించిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్ దేవ్ తో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమానికి పలువురు కోలీవుడ్, టాలీవుడ్ సినీ తారలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు ..ఇకపోతే థాయిలాండ్ లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. అందుకే చెన్నైలో చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయడం గమనార్హం..
పెళ్లి బట్టలో మహాలక్ష్మిల మెరిసిపోతున్న వరలక్ష్మి
ఇదిలా ఉండగా రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.. అయితే ఇప్పుడు తాజాగా పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. పెళ్లి బట్టల్లో వరలక్ష్మి మహాలక్ష్మి లా ఎంతో అందంగా కనిపిస్తోంది.. వరలక్ష్మి ఎరుపు రంగు పట్టుచీర ధరించగా.. వరుడు నికోలయ్ పట్టు పంచె ధరించి పెళ్లి పీటలు ఎక్కారు.. పెద్దల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలోనే వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలు..
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికి వస్తే.. హీరోయిన్ గా శరత్ కుమార్ వారసురాలిగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. అక్కడ హీరోయిన్గా అవకాశాలు అందుకుంది.. కానీ సక్సెస్ కాలేకపోయింది. దీంతో టాలీవుడ్లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.. విలన్గా తన నట స్వరూపాన్ని చూపించింది. ముఖ్యంగా టాలీవుడ్ లో రమ్యకృష్ణ తర్వాత అంతటి పేరు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రమే.. ఎటువంటి పాత్రలోనైనా సరే లీనం అయిపోయి నటించగలరు.. తన విలనిజంతో భయపెట్టడమే కాదు.. ఎమోషనల్ గా ఏడిపించగలరు కూడా.. అందుకే ఇప్పుడు ఈమె టాలీవుడ్ సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.
వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్..
ఇంకా గత ఏడాది వచ్చిన హనుమాన్ సినిమాలో హీరోకి అక్క పాత్రలో నటించి అందరిని అబ్బురపరిచిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు సమాచారం ..ఇదిలా ఉండగా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వ్యక్తిగతంగా కూడా చక్కటి ప్లాన్ చేసుకుంటోంది .అందులో భాగంగానే సరైన సమయంలోనే వివాహాన్ని చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈమె భర్త విషయానికి వస్తే ముంబైలో ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్ గా పేరు దక్కించుకున్న నికోలయ్ సచ్ దేవ్.. ముంబైలో సొంతంగా గ్యాలరీ కూడా నడుపుతున్నారు. అంతేకాదు ఈయన ఆస్తి విలువ సుమారుగా రూ. 900 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అందుకే వీరి వివాహానికి రూ .200 కోట్లు ఖర్చు చేశారు అంటూ వార్తలు రాగా.. దీనిపై స్పందించిన వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి శరత్ కుమార్ అంత ఖర్చు పెట్టి కూతురు వివాహం జరిపించలేదని ..చాలా సింపుల్ గానే వివాహం జరిపించాము అని క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికి అయితే వరలక్ష్మి ఏడడుగులతో కొత్త బంధంలోకి అడుగు పెట్టింది.
View this post on Instagram